Prudhvi Raj: పవన్‌కల్యాణ్‌కు దిష్టి తగలకూడదు: పృథ్వీరాజ్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’ సినిమాపై నటుడు, 30 ఇయర్స్‌ ఇన్‌ ఇండస్ట్రీ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భీమ్లానాయక్‌’ వీక్షించిన ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్..

Published : 27 Feb 2022 10:47 IST

‘భీమ్లానాయక్‌’లో చేయలేకపోయినందుకు..

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’పై నటుడు పృథ్వీరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాను వీక్షించిన ఆయన ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడారు. సినిమా తనకు ఎంతో బాగా నచ్చిందని.. పవన్‌కల్యాణ్‌కు దిష్టి తగలకూడదని అన్నారు.

‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, పవన్‌కల్యాణ్‌ అభిమానులకు నా అభినందనలు. తాజాగా నేను ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని చూశాను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘అడవి రాముడు’. ఆ సినిమా విడుదలైనప్పుడు మా తాడేపల్లిగూడెంలోని విజయాటాకీస్‌కు వెళ్తే.. భారీగా తరలివచ్చిన అభిమానుల్ని కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఎన్టీఆర్‌ తర్వాత ఆ క్రేజ్‌ పవర్‌స్టార్‌కే చూశా. క్లైమాక్స్‌, పవర్‌స్టార్‌, రానా కాంబోలో వచ్చిన సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. ఒక ప్రేక్షకుడిలా ఈ చిత్రాన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా చూస్తున్నంతసేపు, ఒక రకమైన బాధలో ఉండిపోయాను. ఇంత అద్భుతమైన చిత్రంలో నేను నటించలేకపోయానే అని విచారంగా ఉంది. చాలా రోజుల తర్వాత పవన్‌కల్యాణ్‌ని ఇలాంటి పాత్రలో చూసి అందరి దిష్టి తగిలి ఉంటుంది. ఆయనకు అది తగలకూడదని కోరుకుంటున్నా’’ అని పృథ్వీరాజ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని