#KGFChapter2: ఆడియో హక్కులకు రికార్డు ధర

రాకీభాయ్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని మార్గాలు సుగమం చేసుకుంటున్నాడు. రాక్‌స్టార్‌ యష్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌2’ త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వల్ల నిలిచిపోయిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను చిత్రబృందం తిరిగి ప్రారంభించింది.

Published : 02 Jul 2021 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాకీభాయ్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని మార్గాలు సుగమం చేసుకుంటున్నాడు. రాక్‌స్టార్‌ యశ్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌2’ త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వల్ల నిలిచిపోయిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను చిత్రబృందం తిరిగి ప్రారంభించింది. తాజాగా.. ఈ సినిమా దక్షిణాది భాషల ఆడియో హక్కులను రికార్డు స్థాయిలో రూ.7.2కోట్లు వెచ్చించి లహరి మ్యూజిక్‌, టీ సిరీస్‌ కలిసి కొనుగోలు చేశాయి. కాగా.. ఈ సినిమా జులై 16న విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల విడుదల తేదీ వాయిదా పడింది. ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త విడుదల తేదీ వినిపిస్తోంది. సెప్టెంబర్‌ 9న కేజీయఫ్‌2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచిస్తోందట. అయితే.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి.

ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యశ్‌ హీరోగా.. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ ‘అధీరా’గా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌, రవీనా టాండన్‌, సముద్రకని కీలక పాత్రలు పోషించారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌2’ ఐదు భాషల్లో విడుదల కానుంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు