మనిషికి.. మనిషిలోని మృగానికి యుద్ధం
భారత్ నుంచి ఆస్కార్కు వెళ్లిన ‘జల్లికట్టు’ సినిమాను మలయాళ దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించారు. గతంలో ఆయన తీసిన ‘అంగమలి డైరీస్’, ‘ఈమాయు’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. 2019లో విడుదలయిన ‘జల్లికట్టు’ మానవుడిలో అంతర్లీనంగా దాగి ...
సినిమా: జల్లికట్టు
దర్శకుడు: లిజో జోస్ పెల్లిసరీ
విడుదల: 2019
నటీనటులు: ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్, సబుమన్ అబ్దుసమద్, శాంతి బాలచంద్రన్ తదితరులు
నిడివి: 1 గంట 31 నిమిషాలు
ఎక్కడ చూడొచ్చు: అమెజాన్ ప్రైమ్(మలయాళం), ఆహా(తెలుగు)
భారత్ నుంచి ఆస్కార్కు వెళ్లిన ‘జల్లికట్టు’ సినిమాను మలయాళ దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించారు. గతంలో ఆయన తీసిన ‘అంగమలి డైరీస్’, ‘ఈమాయు’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. 2019లో విడుదలయిన ‘జల్లికట్టు’ మానవుడిలో అంతర్లీనంగా దాగి ఉన్న మృగాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. దీనికి కథను అందించింది ఎస్. హరీష్. ఆయన రాసిన చిన్న కథ ఆధారంగానే జల్లికట్టు తెరకెక్కింది. చెప్పాలంటే ఇది దర్శకుడి ఒక్కడి సినిమానే కాదు. ప్రేక్షకులను దున్నపోతు వెంట పరిగెత్తేలా చేసిన కెమెరామెన్ గిరీష్ గంగాధరన్, ఆ రాత్రి చీకటిలో అడవిలోని రహస్య శబ్దాలను, జంతువులు, కీచురాళ్లు, క్రిమికీటకాల ధ్వనులను స్పష్టంగా వినిపిస్తూనే, అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన ప్రశాంత్ పిళ్లైలకూ ఇందులో సమానమైన అర్హత ఉంటుంది. విడుదలకు ముందే పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శనలకు ఎంపికై సత్తా చాటిన ‘జల్లికట్టు’.. ఇప్పుడు మన దేశం నుంచి ఆస్కార్ బరిలోకి దిగబోతోంది. ఆ సినిమాలోని దర్శకుడు చెప్పిన కథేంటీ.. అసలు ఏం చెప్పే ప్రయత్నం చేశాడో చూద్దాం.
కథ: కేరళలోని ఒక మారుమూల అటవీ గ్రామంలో ఈ కథ నడుస్తుంది. అక్కడ అంటోని అనే కసాయి ఉంటాడు. ఊరంతా అతడి దగ్గరే గేదె మాంసాన్ని కొంటుంటారు. ఇలా నరికేందుకు తెచ్చిన ఓ నాటు దున్న భయంతో తప్పించుకోవడంతో ఊరంతా గందరగోళం రేగుతుంది. ఊర్లో పంటలను నాశనం చేస్తూ, అడ్డొచ్చిన వారిని తన కొమ్ములతో కుమ్మేస్తూ పరుగులు పెడుతుంది. ఆ గ్రామంలో రేగిన అలజడిని అదుపు చేసేందుకు పోలీసులు వస్తారు. ఇళ్లలోంచి ప్రజలు ఆ దున్నను పట్టుకునేందుకు గుంపులుగా బయటకొచ్చి చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దాన్ని పట్టుకునే క్రమంలో కుట్టచ్చాన్, ఆంటోనిల మధ్య ఆధిపత్య పోరు చెలరేగుతుంది. బృందాలుగా విడిపోయి వారు చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. వీరంతా కలిసి ఆ దున్నను పట్టుకున్నారా? లేదా? అన్నది మిగతా కథ.
రాక్షసానందం: కాలం ముందుకు కదులుతుందని సంకేతం వచ్చేలా గడియారం శబ్దంతో ఊరి ప్రజలను నిద్రలేపుతున్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. అదే సినిమా చివరకు వచ్చే సరికి సమూహం వెర్రెక్కిపోయి ఒక గుట్టలా పేరుకుపోయాక.. మనల్ని ఆదిమానవుల కాలానికి తీసుకెళ్తాడు దర్శకుడు. అంటే మన నాగరిక జీవితంలో ముందుకు వెళుతున్నామా? లేక వెనక్కివెళ్తున్నామా? అనే ప్రశ్నను ఈ సన్నివేశాల ద్వారా లేవనెత్తుతాడు. ఓ మూగజీవాన్ని చంపడంలోనే మనిషిలోని రాక్షస ప్రవృత్తిని చూపించలేదు. చాలా పాత్రలు, సన్నివేశాలతో ఈ విషయాన్ని మన హృదయాలపై ముద్రించాడు దర్శకుడు. ఊరంతా భయపడుతుంటే పాత బాకీని వడ్డీతో సహా ఇమ్మనే వ్యాపారి, అదే వ్యాపారిని ఎవరికీ అనుమానం కలగకుండా దున్న ముందుకు తోసే సన్నివేశం, ఇంట్లో భార్యను ఇష్టమొచ్చినట్లు తిడుతూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడే పోలీసు, పశువుని ఉచ్చులో బిగించానని చెప్పి ఒంటరి ఆడదాన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసే ఆంటోని, ఊరంతా అల్లకల్లోలం అవుతుంటే వీరి అసహాయతను హేళన చేసే పక్కఊరి కుర్రకారు. ఇలా చాలా సన్నివేశాల్లో మనలో నిగూఢంగా దాగి ఉన్న రాక్షసత్వాన్ని కళ్లకు కట్టారు.
మనమింకా జంతువులమేనా?
దున్నపోతు, మనిషి పాదముద్రలను ఒక ఫ్రేములో చూపిస్తూ ఇంత అభివృద్ధి సాధించిన ఈ నాగరిక ప్రపంచంలో మనమింక జంతు సమానులమే అని చెప్పే ప్రయత్నం చేశాడు. వీటితో పాటు దున్నపోతును రక్షించేందుకు బావిలోకి దిగే సన్నివేశంలో మనిషి జంతువుల స్థాయికి దిగజారిపోతున్న వైనాన్ని తన కెమెరాతో పట్టి చూపిస్తాడు. ఆ చిట్టచివరి సన్నివేశంతో ఈ సృష్టిలో జీవాలన్నింటికన్నా మనిషే అత్యంత ప్రమాదకరమని తేల్చేశాడు. కథ పరంగా చిన్నదే కానీ విశ్లేషిస్తే వీడని చిక్కుముడులెన్నో?
మనకు మనతోనే పోరాటం
దర్శకుడి ఆలోచనకు కెమెరామెన్, సంగీత దర్శకుడు ప్రాణం పోశారు. సినిమాలో ఒక్క పాట లేకున్నా నేపథ్య సంగీతంతో కావాల్సిన నాటుదనాన్ని, పశుతత్వాన్ని అందించాడు ప్రశాంత్ పిళ్లై. దున్నపోతు వెంట పరిగెడుతున్న జనం. వారిని వెంటాడుతూ కెమెరా.. వేలమంది గుంపును ఆ అంధకార అడవిలో కెమెరా కన్నుతో పట్టుకోవడం గంగాధరన్ ప్రతిభకు నిదర్శనం. ఈ సినిమా చూశాక అనిపించేది ఒక్కటే...ఇది మనిషికి, దున్నకు మధ్య జరిగే పోరాటం కాదు. మనిషికి మనిషిలోని మృగానికి మధ్య జరిగే అంతర్యుద్ధమని!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!