‘రెహమాన్ రూ.3.47 కోట్లకు పన్ను కట్టలేదు’
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ రూ.3.47 కోట్ల మొత్తంపై పన్ను శాతం కట్టకుండా ఎగరవేశారంటూ ఆదాయ పన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. రూ.3.47 కోట్ల పారితోషికాన్ని నేరుగా తన ఛారిటబుల్ ట్రస్టుకు బదిలీ చేశారని ఫిర్యాదు చేశారు. 2011-12 సంవత్సరంలో రెహమాన్ పన్ను ....
పన్ను ఎగవేత.. అధికారుల ఫిర్యాదు
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ రూ.3.47 కోట్ల మొత్తానికి పన్ను కట్టకుండా ఎగవేశారంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. రూ.3.47 కోట్ల పారితోషికాన్ని నేరుగా తన ఛారిటబుల్ ట్రస్టుకు బదిలీ చేశారని ఫిర్యాదు చేశారు. 2011-12 సంవత్సరంలో రెహమాన్ పన్ను దాఖలు చేయడంలో వ్యత్యాసాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. యూకేకి చెందిన టెలికాం సంస్థ లిబ్రా మొబైల్స్కు రింగ్టోన్స్ కంపోజ్ చేసినందుకుగానూ రెహమాన్ రూ.3.47 కోట్ల పారితోషికం తీసుకున్నారని వివరించారు. 2011లో ఇది జరిగిందని, సరికొత్త రింగ్టోన్స్ కంపోజ్ చేసి ఇచ్చేలా.. సదరు సంస్థతో రెహమాన్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారని ఫిర్యాదులో తెలిపారు.
పారితోషికం నేరుగా రెహమాన్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందని, దానికి పన్ను కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. పన్ను కట్టిన తర్వాత.. ట్రస్టుకు బదిలీ చేయాలని, కానీ అలా చేయలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ వి భవానీ సుబ్బరాయన్తో కూడిన ధర్మాసనం రెహమాన్కు నోటీసులు జారీ చేసింది.
గత ఫిబ్రవరిలో రెహమాన్ రూ.6.79 కోట్ల బకాయి, రూ.6.79 కోట్ల జరిమానా చెల్లించాలని జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ (సీఈ) జారీ చేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు మధ్యంతర స్టే మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రెహమాన్ సినిమాలకు సంగీతం అందించడం ద్వారా తీసుకున్న పారితోషికానికి పన్ను చెల్లించలేదని జీఎస్టీ కౌన్సిల్ అప్పుడు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).