Aadavallu Meeku Johaarlu: నవ్వించిన శర్వా.. మళ్లీ కావాలని అడిగారు
‘‘కుటుంబ వినోదంతో నిండిన సినిమాలు ‘శతమానం భవతి’ తర్వాత చేయలేదు. ‘మహానుభావుడు’లో నవ్వించిన ఆ శర్వా మళ్లీ మాకు కావాలని అడిగారు చాలా మంది.
‘‘కుటుంబ వినోదంతో నిండిన సినిమాలు ‘శతమానం భవతి’ తర్వాత చేయలేదు. ‘మహానుభావుడు’లో నవ్వించిన ఆ శర్వా మళ్లీ మాకు కావాలని అడిగారు చాలా మంది. వాళ్లందరి కోరిక నెరవేర్చే సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఓ చిరునవ్వుతో ఇంటికెళ్లేలా ఉంటుందీ చిత్రం’’ అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. రష్మిక మందన్న కథా నాయిక. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నిండా ఆడవాళ్లే కనిపిస్తారు. యువతరంతోపాటు, కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ కథ రాసుకుంటున్నప్పుడు ఎంతగా ఆస్వాదించానో, చిత్రీకరణ దశలోనూ... నిర్మాణానంతర కార్యక్రమాల సమయంలోనూ అదే స్థాయిలో నవ్వుకున్నా. ఖుష్బూ, రాధికలాంటి సీనియర్లతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. దేవిశ్రీప్రసాద్తో కలిసి ఇది నాకు నాలుగో సినిమా. చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ ‘‘ఆడవాళ్లందరి మధ్య కూర్చుని చాలా సరదాగా చేసిన సినిమా ఇది. కామెడీ కోసమని ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథలో భాగంగానే ఉండాలి. అందుకే మంచి కథ కోసం ఎదురు చూశా. కిషోర్ ఓ బలమైన కథతో, మంచి పేరుతో వచ్చారు. రాధిక, ఖుష్బూ తదితర నటులతో కలిసి నటించడం ఓ లక్ష్యాన్ని చేరుకున్న అనుభూతినిచ్చింది. రష్మిక చాలా క్రమశిక్షణ కలిగిన నటి. ఆమెతో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది’’ అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘‘దర్శకుడు కిషోర్ ఈ కథ చెబుతున్నప్పుడే చాలా నవ్వుకున్నా. సినిమా చిత్రీకరణలోనూ అంతే. ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారు’’ అన్నారు. ‘‘తెలుగులో 250కిపైగా సినిమాలు చేశా. ఈ చిత్రంతో మరో మంచి జ్ఞాపకం. ప్రతీ పాత్రకీ మంచి ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబంతో కలిసి చూడాలి’’ అన్నారు రాధికా శరత్కుమార్. నటి ఖుష్బూ మాట్లాడుతూ ‘‘కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శర్వానంద్ ఈ సినిమాకి మూలస్తంభం’’ అన్నారు ఖుష్బూ. నటి ఝాన్సీతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
రంగంలోకి రాజాసాబ్
‘రాజాసాబ్’ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. -
తొలి హిందీ చిత్రం కాస్త ఆలస్యం?
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది కీర్తి సురేశ్. త్వరలో ఆమె ‘బేబీ జాన్’తో ప్రేక్షకులను పలకరించనుంది. -
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
‘‘స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ‘పారిజాతపర్వం’. దీంట్లో అపరిమితమైన వినోదం ఉంది. తప్పకుండా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు హీరో చైతన్య రావు -
రెండు కోణాల్లో తమన్నా?
ది అన్టోల్డ్ స్టోరీ’, ‘రుస్తుం’, ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే. -
రామోజీ ఫిల్మ్సిటీలో అక్షయ్ సందడి
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. -
అమితాబ్కు లతా మంగేష్కర్ పురస్కారం
పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ఇవ్వనున్నట్లు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు -
నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు!
‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు -
వాస్తవ జీవిత కథే ఆధారం
‘‘ప్రేమకథతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’. ఇందులో మేము ఒక కొత్త అంశాన్ని స్పృశించాం. అది తప్పకుండా ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు దర్శకుడు వీఎస్ ముఖేష్. -
కన్నడ నటుడు ద్వారకీష్ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకనిర్మాత ద్వారకీష్(81) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు కేజీ జయన్ మృతి
ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు కేజీ జయన్(90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ కేరళలోని త్రిపుణితురలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. -
ఆ అమ్మాయి జోలికి రావద్దు
‘‘ఆ అమ్మాయి నా ప్రాణం.. నా ఊపిరి. తన జోలికొస్తే వెతుక్కుంటూ వచ్చి నరికేస్తా’’ అని హెచ్చరిస్తున్నారు విశాల్. మరి ఆయన ప్రేమ కథేంటి? దానికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే ‘రత్నం’ చూడాల్సిందే. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
-
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం
-
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
-
మోదీ వేవ్ లేదట.. వివాదంలో భాజపా అభ్యర్థి నవనీత్ రాణా
-
నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు
-
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?