Karthikeya: పెద్ద దెబ్బలే తగిలాయి..ఎవరికీ చెప్పలేదు
‘ప్రస్తుతం యూవీ క్రియేషన్స్లో ఓ చిత్రం చేస్తున్నా. ప్రశాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్లో ఓ చిత్రం చేయనున్నా. శ్రీదేవి
‘ప్రస్తుతం యూవీ క్రియేషన్స్లో ఓ చిత్రం చేస్తున్నా. ప్రశాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్లో ఓ చిత్రం చేయనున్నా. శ్రీదేవి మూవీస్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే అజయ్ భూపతి, నేను మరో చిత్రం చేయనున్నాం. ఇది ఈ ఏడాదిలోనే పట్టాలెక్కే అవకాశముంది’’.
‘‘నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే.. బిగ్ స్టార్ అనిపించుకోవాలి. ఇప్పుడు నేను హీరోగా చేసినా.. విలన్గా చేస్తున్నా.. అది నా కెరీర్ను ఆ దిశగా ముందుకు తీసుకెళ్లడానికే. అలాగని ఏది పడితే అది చేసేయాలనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మళ్లీ విలన్గా చేయాలన్నా.. ఆ కథ బాగుండాలి, అందులో నా పాత్ర కొత్తగా, శక్తిమంతంగా ఉండాలి. అప్పుడే ఆ సినిమా చేయాలన్న ఉత్సుకత కలుగుతుంది’’ అన్నారు కార్తికేయ. ‘ఆర్ఎక్స్ 100’తో హీరోగా మెప్పించిన ఆయన.. నాని ‘గ్యాంగ్లీడర్’ సినిమాతో ప్రతినాయకుడిగానూ అలరించారు. ఇప్పుడాయన ‘వలిమై’ కోసం మరోసారి విలన్గా మారారు. అజిత్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రమిది. హెచ్.వినోద్ తెరకెక్కించారు. బోనీ కపూర్ నిర్మాత. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు కార్తికేయ. ఆ విశేషాలివి..
‘గ్యాంగ్లీడర్’ సినిమా చూసి ‘వలిమై’లో విలన్గా అవకాశమిచ్చారా?
‘‘లేదు. నా ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం చూసి ఈ సినిమా కోసం సంప్రదించారు. 2019 అక్టోబర్లో తొలిసారి హెచ్.వినోద్ నుంచి ఫోన్ వచ్చింది. ‘అజిత్తో ఓ సినిమా చేస్తున్నాం.. దాంట్లో శక్తిమంతమైన విలన్ పాత్ర ఉంది. హీరో ఇమేజ్తో పాటు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న నటుడు కావాలి. ‘ఆర్ఎక్స్100’ చూశాను. మీ లుక్, ఫిజిక్ బాగుంది. ఈ పాత్ర మీకు సరిగ్గా సరిపోతుంది. చేస్తారా?’ అని అడిగారు. సరే.. ముందు నాకు కథ, నా పాత్ర గురించి చెప్పండి అంటే.. వాళ్ల అసిస్టెంట్ను పంపించి స్క్రిప్ట్ వినిపించారు. నాకు బాగా నచ్చింది. ‘గ్యాంగ్లీడర్’లో చేసిన విలన్ పాత్రలో కన్నా దీంట్లో ఇంకా ఎక్కువ షేడ్స్ కనిపించాయి. నటనకు మరింత ఆస్కారముంది అనిపించింది. అందులోనూ అజిత్కు విలన్ కాబట్టి.. నా పాత్ర మరింత బలంగా తీర్చిదిద్దారు. ఇది చేస్తే తమిళంలోనూ మంచి గుర్తింపు దొరుకుతుంది అనిపించింది. అందుకే స్క్రిప్ట్ విన్న వెంటనే చేస్తానని చెప్పేశా’’.
ఇంతకీ ‘వలిమై’ అంటే ఏమిటి?
‘‘వలిమై’ అనేది తమిళ పదం. బలం అనే అర్థంలో వస్తుంది. అలాగని ఇది శారీరక బలం కాదు. మనోబలం గురించి తెలియజేస్తుంది. నిజానికి ఈ సినిమాకి తెలుగు అదే అర్థం వచ్చే ఓ టైటిల్ పెట్టాల్సి ఉంది. ఈ సినిమా తెలుగులో విడుదల చేయనున్నట్లు ప్రకటించడానికి ముందే.. ‘వలిమై’ అన్న పదం జనాలకు బాగా పరిచయమైపోయింది. అర్థం తెలియకున్నా.. అందరి నోళ్లలో బాగా నానిపోయింది. ఇలాంటప్పుడు తెలుగులో మరో కొత్త టైటిల్ పెడితే.. డబ్బింగ్ సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే అందరికీ పరిచయమైన పేరునే అలా ఉంచేశారు. ఇదొక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. ఇది ఏ భాషా ప్రేక్షకులకైనా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. దీంట్లో నా పాత్ర ఈతరం కుర్రాళ్లకు ప్రతిబింబంలాగే ఉంటుంది. ఈ చిత్రంతో నాకు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు వస్తుందని నమ్మకంగా చెప్పగలను’’.
అజిత్ లాంటి స్టార్ హీరోతో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?
‘‘ఈ సినిమా ప్రయాణంలో అజిత్ నుంచి వృత్తిపరంగా.. వ్యక్తిగతంగా ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధతను మాటల్లో వర్ణించలేం. ఈ సినిమా షూటింగ్ సమయంలో రేసింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగింది. బైక్ రైడ్ చేస్తూ.. అదుపు తప్పి పడిపోయారు. పెద్ద దెబ్బలే తగిలాయి. అయితే ఆయన ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మామూలుగా బైక్ లేపి.. పక్కకు తీసుకొని వచ్చేశారు. నేనప్పుడు అక్కడే ఉన్నాను. తర్వాత విషయం తెలిసి ‘ఎందుకు సర్ ఇంత రిస్క్.. రెండ్రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు కదా’ అని అడిగా. దానికాయన ‘ఇప్పుడు నీ డేట్స్ ఉన్నాయి. మళ్లీ నీకు కష్టమవుతుంది. అలాగే ఫైట్స్ మాస్టర్స్ డేట్స్, లొకేషన్ ఖర్చులు, మళ్లీ ఇక్కడికి రావడాలు.. ఇవన్నీ ఎందుకు. అందరికీ ఇబ్బందే. నేనే ఒకరోజు ఓపిక పడితే సరిపోతుంది కదా’ అన్నారు. అది చూశాక.. నేను ఏస్థాయికి వెళ్లినా వృత్తిపరంగా అంతే నిబద్ధతో ఉండాలని అనుకున్నా’’.
ఈ సినిమా విషయంలో మీకెక్కువ సవాల్గా అనిపించిన అంశాలేంటి?
‘‘రేసింగ్ ఎపిసోడ్లే. నాకు బైక్ రేసింగ్ రాదు. కథ విన్నప్పుడు ఇదే విషయాన్ని దర్శకుడు వినోద్కు చెప్పా. పర్లేదు.. మేము చూసుకుంటాం అన్నారు. షూట్కు ముందు చెన్నైలో చిన్న వర్క్షాప్ చేశాం. ఆ సమయంలోనే జాగ్రత్తగా రేసింగ్ ఎలా చేయాలో చూపించారు. అయితే అజిత్ స్వతహాగానే మంచి బైక్ రేసర్. సెట్లో ఆయన వేగాన్ని అందుకోవడమే సవాల్గా అనిపించేది. ఇలా యాక్షన్ చెప్పే లోపే.. ఆయన ఎక్కడికో వెళ్లిపోయేవారు. ఆ వేగాన్ని అందుకోవడం ఛాలెంజింగ్గా ఉండేది. అయితే నా ఇబ్బందులు చూసి అజిత్ గారే.. కాస్త నెమ్మదిగా నన్ను మ్యాచ్ చేసుకుంటూ చేశారు (నవ్వుతూ). సినిమాలో 80శాతం యాక్షన్ ఎపిసోడ్స్ని డూప్ లేకుండా చేశా. మరీ బైక్లు గాల్లోకి ఎగిరే రిస్కీ షాట్లయితే చేయలేదు. అలాగే ఈ చిత్రం కోసం తమిళం నేర్చుకున్నా’’.
హీరో, విలన్.. ఈ రెండింటిలో ఏది సౌకర్యంగా అనిపిస్తుంది?
‘‘హీరో, విలన్.. ఏ పాత్ర చేసినా కెమెరా ఆన్ అయ్యాక నటనలో పెద్దగా తేడాలుండవు. నేనైతే హీరో పాత్ర కన్నా విలన్ పాత్రని ఇంకా ఎక్కువ ఆస్వాదిస్తుంటా. ఎందుకంటే హీరో పాత్రలకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతినాయక పాత్రలకు అలాంటివి ఉండవు. ముఖ్యంగా ‘వలిమై’లోని సైకో విలన్ లాంటి పాత్రల్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశముంటుంది. దానికి తోడు హీరోగా చేసేటప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. మార్కెట్ లెక్కలు, ప్రమోషన్లు అన్నీ మన ఒక్కరితోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి చాలా ఒత్తిడి ఉంటుంది. విలన్ పాత్రల విషయంలో ఇలాంటి ఒత్తిడులుండవు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు (Latest News)
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!