వరుణ్, నిహారిక విషయంలో నా తప్పు అదే..!
పిల్లలు తమ భావాల్ని, తప్పుల్ని చెప్పుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించాలని ప్రముఖ నటుడు నాగబాబు అన్నారు. ఆయన తన యూట్యూబ్ ఛానెల్లో ‘కమ్యూనికేషన్’ అనే అంశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా........
నటుడు నాగబాబు
హైదరాబాద్: పిల్లలు తమ భావాల్ని, తప్పుల్ని చెప్పుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించాలని ప్రముఖ నటుడు నాగబాబు అన్నారు. ఆయన తన యూట్యూబ్ ఛానెల్లో ‘కమ్యూనికేషన్’ అనే అంశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన తల్లి అంజనాదేవి, పిల్లలు వరుణ్ తేజ్, నిహారిక గురించి ప్రస్తావించారు.
‘‘మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. కమ్యూనికేషన్ గురించి ఆమెకు తెలియదు. ‘అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి’ అని చెప్పేది కాదు. కానీ.. అన్నం పెట్టేటప్పుడు, కౌగిలించుకుని నిద్రపుచ్చే సమయంలో తన స్పర్శ ద్వారా ప్రేమను తెలిపేది. మాతో అద్భుతంగా కమ్యూనికేట్ అయ్యేది. నాకు తెలిసి దీనికి చదువు అవసరం లేదు. వ్యక్తిగతంగా నా కమ్యూనికేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలి. నేను గొప్పగా మాట్లాడకపోవచ్చు, కానీ నా భావాల్ని సరిగ్గా వ్యక్తం చేయగలను. పిల్లలు వరుణ్, నిహారికకు చాలా విషయాల్ని వివరించేవాడిని. పాఠాలతోపాటు ఎలా ప్రవర్తించాలో చెప్పేవాడిని. వాళ్లు తప్పు చేస్తే గట్టిగా మందలించి, తిట్టేవాడిని.. కొట్టాను కూడా. అది నేను చేసిన చిన్న పొరపాటు. పిల్లల్ని కొట్టకూడదు. ఓ రెండుసార్లు అలా జరిగింది. అప్పుడు నాకు పరిపక్వత లేకపోవడం వల్ల అలా చేశా. ‘మాతో ధైర్యంగా మీ భావాల్ని పంచుకోండి’ అని నా కుమారుడు, కూతురికి నేను ఎప్పుడో చెప్పా. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అవకాశం ఇవ్వాలి. ‘అమ్మో.. నాన్న దగ్గరికి వెళితే ఏం జరుగుతోందో’ అనే భయం వాళ్లకి ఉండకూడదు’’.
‘‘ఓ రోజు వరుణ్, నిహారికను పిలిచి.. ‘మీ ఇద్దరికీ ఏ సమస్య వచ్చినా.. నేను దాన్ని విని, పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తాను. మీరు చెప్పుకోలేని తప్పు చేసినా సరే.. నాతో చెప్పండి. ఆవేశంలో ఓ మాట అనొచ్చు.. కానీ సమస్యను తీర్చగలను. ఈ భూమిపై నాకు ముఖ్యమైన వ్యక్తులు మీరిద్దరే’ అన్నాను. ఇప్పుడు మా మధ్య కమ్యూనికేషన్ బాగుంది. వరుణ్ డిగ్రీ మొదటి ఏడాదిలో.. ‘నాన్నా.. సినిమాల్లో నటిస్తాను’ అన్నాడు. నిహారిక కూడా అలానే చెప్పింది. నేను ఓకే చెప్పా. చిత్ర పరిశ్రమలో విజయాలు, అపజయాలు చాలా సామాన్యం. ‘మంచి నటుడ్ని అవుతానని నాన్నకు మాట ఇచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది..’ అని వరుణ్ ఒత్తిడికి గురి కాకూడదు. అందుకే.. ‘పెద్ద హీరో కావాలి, లేకపోతే జీవితం వృథా అనుకోకు. ఎలాగైనా జీవించు, కానీ సంతోషంగా ఉండు. నటుడిగా సాధిస్తే.. ఇంకా మంచిది. లేకపోతే సమస్య లేదు. జీవితాంతం నేను నిన్ను చూసుకుంటా, నేను చనిపోయిన తర్వాత కూడా అన్నీ సౌకర్యాలు ఉండేలా చూస్తా. నువ్వు ఎలా ఉన్నా.. నా కుమారుడివి’ అని చెప్పా. నిహారికతోనూ ఇలానే అన్నాను. చుట్టుపక్కల ఉన్న పది మంది ఏం అనుకుంటున్నారనే విషయం నాకు ముఖ్యం కాదు. నా పిల్లలు సంతోషంగా ఉండటం నాకు కావాలి. సాధించలేకపోయాననే నిరాశ వాళ్లు చెందకూడదు’’ అని నాగబాబు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావు: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే