రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌

కరోనాతో పోరాడుతూ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చికిత్స పొందుతున్న సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఆరోగ్య

Updated : 27 Oct 2020 19:47 IST

హైదరాబాద్‌: కరోనాతో పోరాడుతూ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చికిత్స పొందుతున్న సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు మంగళవారం బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్‌ రత్నకిషోర్‌ తెలిపారు.

‘‘కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన డాక్టర్‌ రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. తాజాగా ప్లాస్మా థెరపీ కూడా చేశాం. దాంతో పాటు, సైటోసోర్బ్‌ పరికరం ద్వారా చికిత్స చేస్తున్నాం. గతంతో పోలిస్తే, రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మా వైద్య బృందం చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు’’ అని సిటీ న్యూరో సెంటర్‌ ప్రకటన విడుదల చేసింది.

కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రాజశేఖర్‌ సతీమణి జీవిత ఇప్పటికే కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు