రాజశేఖర్‌ ఆరోగ్యంపై స్పందించిన జీవిత

సినీ నటుడు రాజశేఖర్‌ కరోనాతో పోరాడుతూ సినీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి

Updated : 22 Oct 2020 19:11 IST

హైదరాబాద్‌: సినీ నటుడు రాజశేఖర్‌ కరోనాతో పోరాడుతూ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వచ్చాయి. ఆయన కుమార్తె శివాత్మిక కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు. వదంతులు నమ్మొద్దని కోరారు.

తాజాగా రాజశేఖర్‌ సతీమణి జీవిత మాట్లాడారు. ప్రస్తుతం రాజశేఖర్‌ ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని అన్నారు. దయచేసి అసత్యవార్తలను నమ్మవద్దని అదే విధంగా, ప్రచారం చేయొద్దని కోరారు. రాజశేఖర్‌ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించమని కోరారు.

ఈ రోజు మధ్యాహ్నం రాజశేఖర్‌ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్‌ ప్రకటన విడుదల చేసింది. రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్ రత్నకిశోర్‌ తెలిపారు. తన మిత్రుడు త్వరగా కోలుకోవాలని అగ్ర నటుడు చిరంజీవి సైతం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థించారు.

ఇవీ చదవండి...!

రాజశేఖర్‌ చికిత్సకు స్పందిస్తున్నారు: వైద్యులు

నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి: చిరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని