నటుడు సన్నీదెవోల్‌ కు కరోనా

బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ సన్నీ డియోల్‌ (64) కరోనా బారిన పడ్డారు. వైరస్‌ బారిన పడినట్లు ఆయన బుధవారం ఉదయం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు....

Published : 02 Dec 2020 14:19 IST

దిల్లీ: బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ సన్నీదెవోల్‌ (64) కరోనా బారిన పడ్డారు. వైరస్‌ బారిన పడినట్లు ఆయన బుధవారం ఉదయం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నా. ఈమధ్య కాలంలో నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని ట్వీట్‌ చేశారు.

పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ ఎంపీ అయిన సన్నీకి కొద్దిరోజుల క్రితం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం కులులోని ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్యం మెరుగవ్వడంతో మిత్రులతోకలిసి ముంబయి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఆయన ముంబయి ప్రయాణాన్ని విరమించుకొని ఫాంహౌజ్‌లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు