పెళ్లి గురించి అనసూయతో నవదీప్ ఏమన్నారంటే?
కథానాయకుడిగా, సహ నటుడిగా తెలుగు వారిని మెప్పించిన నవదీప్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో ముచ్చటించారు. ఫాలోవర్స్ అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ క్రమంలో ‘పెళ్లి ఎప్పుడు?, ఎందుకు చేసుకోవట్లేదు?’ అని పలువురు నెటిజన్లు అదే ప్రశ్న అడగగా.. ‘ఎందుకు చేసుకోవాలి?.. ఆపండయ్యా బాబు..
లైవ్లో నవదీప్-బ్రహ్మాజీ-అనసూయ ముచ్చట్లు
హైదరాబాద్: కథానాయకుడిగా, సహ నటుడిగా తెలుగు వారిని మెప్పించిన నవదీప్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో ముచ్చటించారు. ఫాలోవర్స్ అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ క్రమంలో ‘పెళ్లి ఎప్పుడు?, ఎందుకు చేసుకోవట్లేదు?’ అని పలువురు నెటిజన్లు అదే ప్రశ్న అడగగా.. ‘ఎందుకు చేసుకోవాలి?.. ఆపండయ్యా బాబు.. ఎప్పుడూ నా పెళ్లి గురించే అడుగుతుంటారు (నవ్వుతూ)’ అని చెప్పారు.
అనంతరం.. ‘ఇటీవల హిమాలయాలకు వెళ్లి వచ్చా. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా’ అని ఒకరికి జవాబిచ్చారు. ‘క్రికెట్ చూస్తారా?’ అని ప్రశ్నించగా.. ‘నాకు ఆసక్తి లేని అంశం అది’ అని చెప్పారు. ‘ఇప్పటి వరకు చిరుతో కలిసి పనిచేయలేదు కదా?’ అని ప్రశ్నించగా.. ‘చిరంజీవి గారితో ఇంత వరకు కలిసి పనిచేయలేదు. ఆ అదృష్టం నాకు ఇంకా రాలేదు. వస్తుందని ఆశిస్తున్నా..’ అని పేర్కొన్నారు.
ఇంతలో నవదీప్తోపాటు యాంకర్ అనసూయ లైవ్లో చేరారు. హిమాలయాల ట్రిప్ గురించి అడిగారు. ‘ఎంతమంది వెళ్లారు నవదీప్’ అని ప్రశ్నించగా.. ‘14 మంది కలిసి వెళ్లాం, ఆరు బైక్లు. ఐదు రోజుల ట్రిప్. నేను ఇప్పటి వరకు మూడుసార్లు హిమాలయాలకు వెళ్లా. బైక్పై అక్కడ రైడ్కు వెళ్లడం రెండుసార్లు. భార్య, గర్ల్ఫ్రెండ్ లేకపోతే ఇలా సంతోషంగా వెళ్లొచ్చు’ అని చెప్పారు. దీనికి అనసూయ స్పందిస్తూ.. ‘మా ఆయన కూడా అదే అంటున్నారు. ‘నవదీప్కు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. కాబట్టి హ్యాపీగా వెళ్తాడు..’ అన్నాడు. ‘ఏ నువ్వు పెళ్లి చేసుకున్నందుకు ఫీల్ అవుతున్నావా?’ అని నేను మా ఆయన్ను అడిగా (నవ్వుతూ)’ అని చెప్పారు.
ఆపై ప్రముఖ నటుడు బ్రహ్మాజీ లైవ్లోకి వచ్చారు. తను సినిమా షూటింగ్ కోసం శంషాబాద్లో ఉన్నట్లు చెప్పారు. సాయి శ్రీనివాస్, సోనూసూద్తో కలిసి నటిస్తున్నానని వెల్లడించారు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ‘బ్రహ్మాజీ గారు గొప్ప వ్యక్తి’ అని నవదీప్ ఫాలోవర్స్కు చెప్పడంతో ఆయన ఇచ్చిన రియాక్షన్ నవ్వులు పూయించింది.
అంతేకాదు నవదీప్ తన ఫాలోవర్స్లో ఓ మహిళను లైవ్లోకి తీసుకున్నారు. ‘నేను దీన్ని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది..’ అని ఆమె సంబరపడిపోయారు. అనంతరం నవదీప్ వర్షాల గురించి ప్రస్తావించారు. ‘హైదరాబాద్లో వరదల వల్ల చాలా మంది ప్రభావితమయ్యారు. ఆదుకోమని నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. నా వంతు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. కానీ, నా ఒక్కడి వల్ల ఇది సాధ్యం కాదు. మీరంతా కూడా చుట్టూ ఉన్న వారికి సాయం చేయండి’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా