రాత్రికి రాత్రే స్టార్డమ్ వెనుక ఆరేళ్ల కష్టం..!
ది 2018 జులై 12.. ‘ఆర్ఎక్స్ 100’ థియేటర్లో విడుదలైంది. సినిమా హిట్.. అందాల విందుతోపాటు అభినయం ప్రదర్శించిన పాయల్ రాజ్పూత్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘నటి ఎవరు? రాత్రికి రాత్రే స్టార్డమ్ సాధించింది..’ అనుకున్నారు. కానీ ఆమె విజయం వెనుక ఆరేళ్ల కష్టం ఉందనే....
పాయల్ బర్త్డే స్పెషల్.. మీకివి తెలుసా?
అది 2018 జులై 12.. ‘ఆర్ఎక్స్ 100’ థియేటర్లో విడుదలైంది. సినిమా హిట్.. అందాల విందుతోపాటు అభినయం ప్రదర్శించిన పాయల్ రాజ్పూత్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘నటి ఎవరు? రాత్రికి రాత్రే స్టార్డమ్ సాధించింది..’ అనుకున్నారు. కానీ ఆమె విజయం వెనుక ఆరేళ్ల కష్టం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. పాయల్ 2010లోనే నటిగా కెరీర్ ఆరంభించారు. ఉత్తమ అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. ఎన్నో ఆడిషన్స్లో పాల్గొన్నారు. చివరికి టాలీవుడ్ గూటికి చేరారు. శనివారం ఈ భామ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం...
పాయల్ది పంజాబీ కుటుంబం. పుట్టి, పెరిగింది దిల్లీలో. ఆమె తల్లిదండ్రులు టీచర్లు. పాయల్ నాలుగేళ్ల వయసులోనే ముఖానికి రంగేసుకున్నారు. పలు పంజాబీ సీరియళ్లలో నటించారు. ఆమె తల్లికి యాంకరింగ్ అంటే ఆసక్తి ఉండేదట. అదే పాయల్ను బాలనటిగా మార్చింది. బుల్లితెరతో ఉన్న అనుబంధం వల్ల ఈ భామ జర్నలిజంలో డిగ్రీ పూర్తయ్యాక యాంకరింగ్ చేసింది. కళాశాల రోజుల్లోనే మోడలింగ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాతే ఆమెలో సినిమాల్లో నటించాలనే ఆశ పెరిగింది. |
రూ.లక్ష పట్టుకుని సినీ అవకాశాలు వెతుక్కుంటూ తొలిసారి ముంబయిలో అడుగుపెట్టింది. ఎన్నో ప్రకటనల్లో నటించడంతోపాటు వ్యాఖ్యాతగా పనిచేయడం వల్ల వచ్చిన డబ్బు అది. దాంతోనే తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమైంది. తెలుగు, తమిళ చిత్ర సీమల్లో ఎన్నో ఆడిషన్లకు హాజరైంది. ప్రతిచోటా తిరస్కారాలే ఎదురయ్యాయి. కొందరు ఆమె ముఖం దక్షిణాది సినిమాలకు పనికిరాదని చెప్పారు. 2010లో ‘సప్నోన్ సే భరే నైనా’ ధారావాహికలో ‘సోనాక్షి’గా పనిచేసే అవకాశం లభించింది. ‘ఆఖిర్ బాహు భీ తోహ్ బేటి హీ హై’, ‘గుస్తాక్ దిల్’, ‘మహాకుంభ్’ తదితర సీరియల్స్లో ప్రధాన పాత్రలో నటించే ఆఫర్ దక్కించుకుని, బుల్లితెర నటిగా రాణించింది.
|
ఎట్టకేలకు కథానాయికగా పాయల్ కెరీర్ ఆరంభమైంది. ‘చన్నా మేరేయా’ (2017) అనే పంజాబీ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటిగా (పరిచయం) ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. హిందీ సినిమా ‘వీరే కీ వెడ్డింగ్’లో చిన్న పాత్రలో కనిపించారు. ఆపై ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తీయబోతున్న తెలుగు సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. |
రెగ్యులర్ సినిమాలు చూసేవారు ‘ఆర్ఎక్స్ 100’ చూడొద్దని కామెంట్ చేసి అందరి దృష్టిలోపడ్డారు అజయ్ భూపతి. ఆయన మాటలు, చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని థియేటర్కు తీసుకెళ్లాయి. ప్రియుడ్ని మోసం చేసిన ప్రేయసి కథతో తీసిన వైవిధ్య చిత్రాన్ని ప్రజలు ఆదరించారు. తొలిసారి తెలుగు వారిని పలకరించిన పాయల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆమె చూపులు కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్నాయి. రాత్రికి రాత్రి ఆమె సినీ స్టార్ అయిపోయారు. ఉత్తమ నటిగా (అరంగేట్రం) సైమా పురస్కారం అందుకున్నారు. ‘వెంకీ మామ’ (2019), ‘డిస్కో రాజా’ (2020) సినిమాలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే పలు పంజాబీ సినిమాల్లోనూ నటించారు. ఇటీవల విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’లో డీగ్లామర్ లుక్, బలమైన పాత్రతో అలరించారు. ఆమె తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్తో కలిసి నటించిన ‘ఏంజెల్’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. |
‘ఆర్ఎక్స్ 100’కి ముందు ఎంతో అభద్రతాభావంతో ఉన్నానని ఓ సారి పాయల్ చెప్పారు. ‘బుల్లితెర నటిగా ఉన్నప్పుడు నా కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. హీరోయిన్ కావాలనేది నా కల.. అది నెరవేర్చుకునే మార్గాలు అప్పట్లో కనిపించలేదు. ఎంతో భయపడ్డాను. ఓ పక్క సీరియల్స్లో నటిస్తున్నా, అవి టీవీలో ప్రసారం అవుతున్నాయి. అయినా సరే ఇబ్బందులు పడ్డా. ముంబయి మహానగరంలో ఖర్చులు ఎక్కువ. ఇంటి అద్దె నుంచి అన్నీ భరించాలి. ఈ నెల నటించా, అద్దె కట్టేశా.. వచ్చే నెల పరిస్థితి ఏంటని బాధపడుతూ ఉండేదాన్ని..’ అన్నారామె. |
‘తెలుగు సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నాకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఏర్పడింది. ‘ఆర్ఎక్స్ 100’లో నా పాత్ర వల్ల కొందరు నిజ జీవితంలోనూ నన్ను చూసి భయపడుతున్నారు. ఈ చిత్రంతో వచ్చిన డబ్బులతో ముంబయిలో ఓ ఇల్లు కొన్నాను. ఆ ఇంటిపైన ‘ఆర్ఎక్స్ 100’కు గుర్తుగా ఓ బైక్ కూడా పెట్టుకున్నా. ఇప్పుడు హైదరాబాద్లోనే నివసిస్తున్నా. అమ్మానాన్నల్ని మిస్ అవుతున్నా..’ అని ఓసారి పాయల్ పేర్కొన్నారు. |
ఈ భామ జీవితంలోనూ ప్రేమకథ ఉంది. ‘నా దృష్టిలో ప్రేమ ఓ అందమైన అనుభూతి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదోక దశలో ప్రేమలో పడే ఉంటారు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి ప్రేమలోపడ్డా. ఆ అబ్బాయి పేరు చెప్పను, చాలా అందంగా ఉండేవాడు. దూరం నుంచి చూస్తూ ఇష్టపడేదాన్ని. ఎప్పుడూ మాట్లాడలేదు. పన్నెండో తరగతి వరకు కలిసే చదువుకున్నాం. కానీ ఎప్పుడూ నా ప్రేమను బయటపెట్టలేదు. ఇప్పుడు ప్రేమించే తీరకలేదు..’ అని పాయల్ చెప్పారు. |
టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఓ సారి పాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ కచ్చితంగా ఉంది. ఇది నన్ను బాగా నిరాశకు గురి చేసింది. నాకు హిట్ వచ్చిన తర్వాత కూడా కాంప్రమైజ్ అవ్వమని అడుగుతున్నారు. నేను షాక్ అయ్యా. బహుశా ‘ఆర్ఎక్స్ 100’లో బోల్డ్ పాత్ర చేయడం వల్లా అనుకుంటా. నాకు నైపుణ్యం ఉంది, నా శ్రమని నమ్ముతాను’ అని పేర్కొన్నారు. ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం |
ఇవీ చదవండి
ఐఏఎస్ కావాలని.. కాపీ రైటర్గా పనిచేసి..!
స్టార్స్తో పెళ్లండీ.. ఫేమస్సైపోయారండీ..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ