అదా శర్మ సరికొత్త ప్రయోగం

‘హార్ట్‌ ఎటాక్‌’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’, ‘క్షణం’ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అదా శర్మ. ఆమె తన తర్వాతి సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. అదా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘క్వశ్చన్‌ మార్క్‌’. విప్ర దర్శకత్వం వహిస్తున్నారు.....

Published : 04 Nov 2020 12:06 IST

హైదరాబాద్‌: ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’, ‘క్షణం’ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అదా శర్మ. ఆమె తన తర్వాతి సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. అదా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘క్వశ్చన్‌ మార్క్‌’. విప్ర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలోని తన పాత్రకు అదా స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోబోతున్నారట. ఆమె స్వరమైతేనే పాత్రకు సరైన న్యాయం జరుగుతుందని దర్శక, నిర్మాతలు భావించినట్లు తెలిసింది. ఆమె తొలిసారి తెలుగులో డబ్బింగ్‌ చెప్పబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇటీవల ఈ సినిమాలోని ప్రత్యేక గీతం ‘రామసక్కనోడివిరా పిలగో..’ విడుదలైంది. దీనికి మంచి స్పందన లభించింది. రఘు కుంచె సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ‘క్వశ్చన్‌ మార్క్‌’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో సంజయ్‌, భానుశ్రీ, అభయ్‌, హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని