Adavallu Miku Joharlu: టైటిల్‌ పాటతో.. ఆడవాళ్లకు జోహార్లు

శర్వానంద్‌, రష్మిక జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 02 Feb 2022 07:15 IST

ర్వానంద్‌, రష్మిక జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇప్పుడిందులో భాగంగా ఈనెల 4న సాయంత్రం  4:05 గంటలకు చిత్ర టైటిల్‌ గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా శర్వా కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ పోస్టర్‌లో స్టైలిష్‌ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే మహిళా ప్రాధాన్యమున్న కథాంశంతో ఫీల్‌ గుడ్‌ మూవీలా రూపొందిస్తున్నాం. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని