సమంత, సాయిపల్లవి కాదు.. అదితి ఫిక్స్

శర్వానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటించనున్నారే విషయంలో గతకొన్నిరోజుల నుంచి విపరీతంగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే సమంత, సాయిపల్లవి, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో....

Published : 13 Oct 2020 01:22 IST

చిత్రబృందం క్లారిటీ

హైదరాబాద్‌: శర్వానంద్, సిద్ధార్థ్‌ కీలక పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్‌ భూపతి దర్శకుడు. ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజుల నుంచి విపరీతంగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే సమంత, సాయిపల్లవి, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ‘మహాసముద్రం’ సినిమాలో హీరోయిన్‌ గురించి తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. అదితిరావు హైదరీ ఇందులో హీరోయిన్‌గా కనిపించనున్నారని అధికారంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది.

‘ప్రతి ప్రకటనతో ‘మహా సముద్రం’ ప్రేక్షకుల చూపుని తన వైపునకు తిప్పుకొంటుంది. శర్వానంద్‌, సిద్దార్థ్‌ లాంటి విలక్షణ నటులతో ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి మా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలెంట్‌, అందం కలిగిన అదితిరావు హైదరీ.. కథానాయికగా ఎంపికయ్యారు. ఎంతోమంది పేర్లు పరిశీలనలోకి వచ్చిన తర్వాత మా సినిమాలోని పాత్రకు అదితి సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావించింది. అంతేకాకుండా అదితి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లవ్‌, యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది.’ అని చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని