నాకు బ్రేకప్ చెప్పి ఆదిత్యను ప్రేమించింది
కాలేజీలో చదువుతున్న రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయిని ఆదిత్యా రాయ్ కపూర్ తనవైపుకు తిప్పుకున్నాడని బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. 2017లో నేహా ధుపియా రేడియో చాట్ షో సీజన్ 2లో ఆయన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జూనియర్ కాలేజీలో అమ్మాయిలు అతడ్ని....
కాలేజీ రోజుల్లో.. ఆదిత్య రియాక్షన్ ఇది..!
ముంబయి: కాలేజీలో చదువుతున్న రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయిని ఆదిత్యా రాయ్ కపూర్ తనవైపుకు తిప్పుకున్నాడని బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. 2017లో నేహా ధుపియా రేడియో చాట్ షో సీజన్ 2లో ఆయన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జూనియర్ కాలేజీలో అమ్మాయిలు అతడ్ని (ఆదిత్య) తెగ ఇష్టపడేవారు. నేను అప్పట్లో ఓ అమ్మాయిని చాలా ప్రేమించా. ఇప్పుడు తనకు పెళ్లైపోయింది, ఒక పిల్లాడు కూడా పుట్టాడు. మేమిద్దరం జీవితం గురించి ఎన్నో కలలు కన్నాం. అలా మా ప్రేమ ఐదేళ్లు సంతోషంగా సాగింది. నేను ఆమె ప్రేమలో పిచ్చిగా మునిగిపోయా. చివరికి నాకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. ఆపై ఆద్యితా రాయ్ కపూర్కు దగ్గరైంది’ అని చెప్పారు.
కాగా దాదాపు మూడేళ్ల తర్వాత రణ్వీర్ వ్యాఖ్యలపై ఆదిత్య స్పందించారు. రణ్వీర్ ఎక్కువగా ఊహించుకుని.. మాట్లాడారన్నారు. ఆ అమ్మాయి ఆయనతో విడిపోయిన కొన్ని నెలల తర్వాత తనను కలిసిందని తెలిపారు. ‘రణ్వీర్ ఎలా ఫీల్ అయ్యాడో, ఏం అనుకున్నాడో నాకు తెలియదు. కానీ వాళ్లిద్దరు విడిపోయిన ఎనిమిది నెలల తర్వాత ఆ అమ్మాయిని నేను చూశా’ అని వివరించారు.
రణ్వీర్, దీపికా పదుకొణె 2018 నవంబరు 14న ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్-లీలా’ సినిమా షూటింగ్లో వీరు ప్రేమలోపడ్డారు. కొన్నేళ్ల తర్వాత ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం రణ్వీర్ తన తర్వాతి సినిమా ‘83’లో నటిస్తున్నారు. ఆదిత్య కథానాయకుడి పాత్ర పోషించిన ‘సడక్ 2’ ఇటీవల ఓటీటీలో విడుదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్