మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా: ఐశ్వర్య

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఆమెతోపాటు ఆరాధ్య, అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే...

Published : 29 Jul 2020 12:39 IST

ముంబయి: కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఆమెతోపాటు ఆరాధ్య, అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌కు కరోనాపాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో వారు చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం చేసిన పరీక్షల్లో ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగెటివ్‌ రావడంతో వారిద్దరూ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య తన ఇన్‌స్టా వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 

‘‘ప్రత్యేకించి మా కోసం మీరు చేసిన ప్రార్థనలకు, చూపిన ప్రేమకు నా ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ పట్ల నా నిజమైన ప్రేమ, ప్రార్థనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండండి’’ అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌లు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. బిగ్‌బి కుటుంబంలో జయాబచ్చన్‌ ఒక్కరే సురక్షితంగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని