Balakrishna: సినిమా రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలి
‘‘హైందవ, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం ‘అఖండ’. తెలుగు ప్రేక్షకులతోపాటు... పొరుగు భాషల నుంచి ఈ సినిమాని వేయినోళ్లా మెచ్చుకున్నారు. భారతదేశం మొత్తానికి కృతజ్ఞతలు చెప్పడానికే ఈ వేడుక
‘అఖండ’ శతదినోత్సవంలో బాలకృష్ణ
‘‘హైందవ, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం ‘అఖండ’. తెలుగు ప్రేక్షకులతోపాటు... పొరుగు భాషల నుంచి ఈ సినిమాని వేయినోళ్లా మెచ్చుకున్నారు. భారతదేశం మొత్తానికి కృతజ్ఞతలు చెప్పడానికే ఈ వేడుక ఏర్పాటు చేశాం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ. ఆయన నటించిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మాత. ఈ సినిమా విడుదలై వంద రోజులైన సందర్భంగా కర్నూలులో కృతజ్ఞత సభని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఇలాంటి శతదినోత్సవం జనం మధ్యలో జరిగి ఎన్నేళ్లయ్యిందో. ఒక మంచి సినిమా చేద్దామనే సంకల్పంతోనే చిత్రాన్ని మొదలుపెట్టాం. ‘సింహా’ చేస్తున్నప్పుడు ‘లెజెండ్’ గురించి అనుకోలేదు, ‘లెజెండ్’ చేస్తున్నప్పుడు ‘అఖండ’ గురించి అనుకోలేదు. పసిపాపల జోలికి, ధర్మం జోలికి వస్తే ఆ భగవంతుడు ఏదో రూపంలో వస్తాడనే ఓ మంచి సందేశాన్ని ఈ సినిమాతో చెప్పాం. అఖండ విజయాన్నిచ్చిన ప్రేక్షక దేవుళ్లకి, నా అభిమానులకి కృతజ్ఞతలు. ‘సినిమా’ గొప్పది. సరిగ్గా వాడుకుంటే ప్రయోజనాలుంటాయి. సినిమా రంగాన్నీ పరిశ్రమగా గుర్తించాలని మేం ప్రభుత్వాల్ని కోరుతున్నాం’’ అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘పదమూడేళ్ల ప్రయాణం నాదీ, బాలకృష్ణది. మా ప్రతీ సినిమా ఓ ప్రయోగమే. దాన్ని ఆదరించింది ప్రేక్షకులే. బాలకృష్ణ నన్ను ఓ కుటుంబ సభ్యుడిలా భావించేలా చేసింది ఈ సినిమాలే’’ అన్నారు.
పూర్ణ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఇలాంటి సినిమా నాకు దొరకదేమో. నా జీవితాన్ని, నా కెరీర్ని మార్చిందీ సినిమా. ప్రగ్యా, శ్రీకాంత్తో కలిసి పనిచేయడం మంచి అనుభవం. అన్స్టాపబుల్ అనే మాటకి సమానమైన వ్యక్తి అంటే నాకు బాలకృష్ణ గుర్తుకొస్తారు’’ అన్నారు.
ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ ‘‘ఇప్పుడున్న రోజుల్లో సినిమా థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకోవడం అంటే చాలా అరుదు. ఇందులో భాగం కావడం నా అదృష్టం. నేను కలిసి పనిచేసినవాళ్లలో ఓ అత్యుత్తమమైన నటుడు బాలకృష్ణ’’ అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారి సమయంలో ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చిన సినిమా ఇది. అఖండ నుంచే ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్కి రావడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి అఖండ విజయాన్నిచ్చారు’’ అన్నారు.
మిర్యాల రవీందర్రెడ్డి మాట్లాడుతూ ‘‘భారతీయ సినిమాకి దిక్సూచిలాంటి విజయాన్ని అందించింది ‘అఖండ’. బాలకృష్ణ అభిమానులంతా కాలర్ ఎగరేసేలా మరో సినిమాని ఆయనతో చేస్తామ’’న్నారు.
ఈ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర, శ్రవణ్, కోటేశ్వరరావు, చిట్టిబాబు, శివకార్తీక్, రాంప్రసాద్, నితిన్ మెహతా, స్టంట్ శివ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి