సంక్రాంతి బరిలోకి ‘అల్లుడు అదుర్స్‌’ 

సంక్రాంతికి బరిలోకి దిగేందుకు మరోసినిమా సిద్ధమైంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘అల్లుడు అదుర్స్‌’ తెరకెక్కుతోంది. కాగా.. పస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా..

Updated : 27 Dec 2020 21:01 IST

హైదరాబాద్‌: సంక్రాంతికి బరిలోకి దిగేందుకు మరో సినిమా సిద్ధమైంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘అల్లుడు అదుర్స్‌’ తెరకెక్కుతోంది. కాగా.. పస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 15న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్‌ ఇద్దరు హీరోయిన్లతో సందడి చేయనున్నాడు. నభానటేశ్‌,  అను ఇమాన్యుయెల్‌ కథానాయికలు. సోనూసూద్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోశ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తొలుత ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపించినా.. అనుకున్నదానికంటే ముందుగానే సంక్రాంతికి బరిలోకి దిగాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.

ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు ‘అల్లుడు సీను’. ప్రభాస్‌ హీరోగా తెలుగులో మంచి విజయం సాధించిన ‘ఛత్రపతి’కి హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఆ సినిమాకు వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనున్నారు. అందులో సాయిశ్రీనివాస్‌కు జోడీ కియారా అడ్వాణీని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రీకరణ పూర్తవగానే రీమేక్‌ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి..

యాక్షన్‌ సీన్లు.. యానిమేషన్‌ మెరుపులు.. లేవ్‌!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని