Project K: కల నిజమైంది

‘ప్రాజెక్ట్‌ కె’ కోసం అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ - కథానాయకుడు ప్రభాస్‌ తొలిసారి కలిసి కెమెరా ముందుకొచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న చిత్రీకరణలో శనివారం ఆ ఇద్దరిపై కీలక సన్నివేశాల్ని

Updated : 20 Feb 2022 09:55 IST

‘ప్రాజెక్ట్‌ కె’ కోసం అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ - కథానాయకుడు ప్రభాస్‌ తొలిసారి కలిసి కెమెరా ముందుకొచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న చిత్రీకరణలో శనివారం ఆ ఇద్దరిపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. దాంతో ఆ ఇద్దరు నటులు చిత్రీకరణ అనుభవాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘‘అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించడంతో నా కల నిజమైంది. ‘ప్రాజెక్ట్‌ కె’ మొదటి షాట్‌ని అమితాబ్‌తో కలిసి పూర్తి చేశాను’’ అంటూ ఇన్‌స్టగ్రామ్‌ ద్వారా తెలిపారు ప్రభాస్‌. అమితాబ్‌ బచ్చన్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ‘‘తొలి రోజు... తొలి సన్నివేశం పూర్తయింది. ‘బాహుబలి’ ప్రభాస్‌తో తొలి సినిమా ఇది. అతని ప్రతిభ, అతని వినయం. మరింత తెలుసుకునేలా చేసింద’’ంటూ వ్యాఖ్య చేశారు. ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. దీపికా పదుకోన్‌ కథానాయిక. అశ్వనీదత్‌ నిర్మాత. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించి, ఆ నేపథ్యంలో చిత్రీకరణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని