ఆడి చావు మన చేతుల్లోనే: పాయల్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కథానాయికగా తెలుగువారికి చేరువైన నటి పాయల్‌ రాజ్‌పూత్‌ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. వాస్తవ సంఘటనలను....

Updated : 19 Nov 2020 17:37 IST

ఆకట్టుకునేలా ‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కథానాయికగా తెలుగువారికి చేరువైన నటి పాయల్‌ రాజ్‌పూత్‌ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దయాల్‌ పద్మనాభం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్‌ ప్రతి నాయకురాలి ఛాయలున్న పాత్రలో నటించారు.

‘మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది.. ఆడి సావు మన సేతుల్లోనే ఉంది. అదే విధి.’; ‘కూరకి కోడిని నువ్వు కొయ్యి.. కూర తిన్నోడ్ని..’ అంటూ పాయల్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. నవంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని