బిజినెస్‌ మొదలెట్టిన ఆనంద్‌ దేవరకొండ

యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రం పారితోషికంతో బిజినెస్‌ ఆరంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ నాకు తొలి పెద్ద విజయాన్ని, చెక్కును ఇచ్చింది. అంతేకాదు మీ ప్రేమ నాలో బలంతోపాటు...

Published : 26 Nov 2020 01:31 IST

హైదరాబాద్‌: యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రం పారితోషికంతో బిజినెస్‌ ఆరంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ నాకు తొలి పెద్ద విజయాన్ని, చెక్కును ఇచ్చింది. అంతేకాదు మీ ప్రేమ నాలో బలంతోపాటు ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఈ విజయాన్ని పంచుకుంటూ మొదటి అడుగుగా నా స్నేహితుడితో కలిసి ఫుడ్‌ డ్రీమ్స్‌లో పెట్టుబడి పెట్టా. విజయ్‌కు, నాకు సక్సెస్‌ ఇచ్చిన సినిమా కథాంశాలన్నీ ఆహారం-డ్రీమ్స్‌ చుట్టూ సాగినవే. అందుకే నా మొదటి పారితోషికంతో మీకు రుచికరమైన ఆహారం తినిపించాలని, నా స్నేహితులకు సపోర్ట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. మేమంతా ఎన్నో కలలు కంటూ కలిసి పెరిగాం’ అని పేర్కొన్నారు. హోటల్‌కు ‘గుడ్‌ వైబ్స్‌ ఓన్లీ కేఫ్‌’ అనే పేరు పెట్టినట్టు ఆనంద్‌ దేవరకొండ తెలిపారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో దీన్ని ఏర్పాటు చేశారు.

‘దొరసాని’ సినిమాతో ఆనంద్‌ హీరోగా కెరీర్‌ ఆరభించారు. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించిన ఇదే సినిమాతో ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక నటిగా అరంగేట్రం చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా నటులుగా ఆనంద్, శివాత్మికకు గుర్తింపు తెచ్చింది. దీని తర్వాత ఆనంద్‌ ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’లో నటించారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని