బిజినెస్ మొదలెట్టిన ఆనంద్ దేవరకొండ
యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘మిడిల్క్లాస్ మెలొడీస్’ చిత్రం పారితోషికంతో బిజినెస్ ఆరంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘‘మిడిల్క్లాస్ మెలొడీస్’ నాకు తొలి పెద్ద విజయాన్ని, చెక్కును ఇచ్చింది. అంతేకాదు మీ ప్రేమ నాలో బలంతోపాటు...
హైదరాబాద్: యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘మిడిల్క్లాస్ మెలొడీస్’ చిత్రం పారితోషికంతో బిజినెస్ ఆరంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘‘మిడిల్క్లాస్ మెలొడీస్’ నాకు తొలి పెద్ద విజయాన్ని, చెక్కును ఇచ్చింది. అంతేకాదు మీ ప్రేమ నాలో బలంతోపాటు ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఈ విజయాన్ని పంచుకుంటూ మొదటి అడుగుగా నా స్నేహితుడితో కలిసి ఫుడ్ డ్రీమ్స్లో పెట్టుబడి పెట్టా. విజయ్కు, నాకు సక్సెస్ ఇచ్చిన సినిమా కథాంశాలన్నీ ఆహారం-డ్రీమ్స్ చుట్టూ సాగినవే. అందుకే నా మొదటి పారితోషికంతో మీకు రుచికరమైన ఆహారం తినిపించాలని, నా స్నేహితులకు సపోర్ట్గా ఉండాలని నిర్ణయించుకున్నా. మేమంతా ఎన్నో కలలు కంటూ కలిసి పెరిగాం’ అని పేర్కొన్నారు. హోటల్కు ‘గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్’ అనే పేరు పెట్టినట్టు ఆనంద్ దేవరకొండ తెలిపారు. హైదరాబాద్లోని ఖాజాగూడలో దీన్ని ఏర్పాటు చేశారు.
‘దొరసాని’ సినిమాతో ఆనంద్ హీరోగా కెరీర్ ఆరభించారు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఇదే సినిమాతో ప్రముఖ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిగా అరంగేట్రం చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా నటులుగా ఆనంద్, శివాత్మికకు గుర్తింపు తెచ్చింది. దీని తర్వాత ఆనంద్ ‘మిడిల్క్లాస్ మెలొడీస్’లో నటించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..