‘ఫైటర్’ గురించి అనన్య కామెంట్..!
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ చిత్రంతో కథానాయికగా వెండితెరపై మెరిశారు నటి అనన్యపాండే. తన అందం, అమాయకత్వపు చూపుల్తో మొదటి చిత్రానికే ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె పూరీ-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రానున్న ‘ఫైటర్’...
ముంబయి: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ చిత్రంతో కథానాయికగా వెండితెరపై మెరిశారు నటి అనన్యపాండే. తన అందం, అమాయకత్వపు చూపుల్తో మొదటి చిత్రంతోనే ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పూరీ-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రానున్న ‘ఫైటర్’(వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తోంది అనన్య. ఈ నేపథ్యంలో తాజాగా అనన్య.. తన తదుపరి చిత్రాల గురించి స్పందించింది. అలాగే, ఇప్పుడిప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంటున్నానని చెబుతోంది.
‘నటిగా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించాను. నా కెరీర్కు ఇది ప్రారంభదశ. కొంతమంది నాపై చూపిస్తున్న అమితమైన అభిమానానికి సంతోషిస్తున్నా. ఇప్పుడిప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ని సైతం పెంచుకుంటున్నాను. అలాగే, నా తదుపరి ప్రాజెక్ట్ల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నాను. దీపికా పదుకొణె, సిద్దార్థ్ చతుర్వేది కీలకపాత్రల్లో నటిస్తున్న ఓ సినిమాలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. ఇటీవల జరిగిన గోవా షెడ్యూల్ బాగా ఎంజాయ్ చేశాను. కథానాయికగా తెలుగుతెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఫైటర్’. విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం.. ఓ విభిన్నమైన ప్రపంచం.’ అని అనన్య వివరించారు. అంతేకాకుండా ‘ఫైటర్’ చిత్రంలోని పాత్ర తనకెంతో నచ్చిందంటూ చెప్పుకొచ్చిందీ భామ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..