ప్రముఖ గాయని తనయుడి కన్నుమూత

ప్రముఖ గాయని, పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్‌ తనయుడు ఆదిత్య పౌడ్వాల్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయి ఆస్పత్రిలో

Updated : 12 Sep 2020 18:26 IST

ముంబయి: ప్రముఖ గాయని, పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్‌ తనయుడు ఆదిత్య పౌడ్వాల్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 35 సంవత్సరాలు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ సహా బాలీవుడ్‌ సినీ సంగీత దర్శకులు, గాయకులు విచారం వ్యక్తం చేశారు.

శంకర్‌ మహదేవన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను పెట్టారు. ‘‘ఈ వార్త వినడం చాలా బాధాకరం. మనకు ఎంతో ప్రియమైన ఆదిత్య పౌడ్వాల్‌ ఇక లేరు. దీన్ని నమ్మలేకపోతున్నా. మంచి సంగీత కళాకారుడు మాత్రమే కాదు. అంతకుమించిన సహృదయం కలిగిన వ్యక్తి. రెండు రోజుల కిందట  తను ప్రోగ్రాం చేసిన పాటను చక్కగా పాడాను. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. లవ్‌ యూ బ్రదర్‌.. మిస్‌ యూ’ అని పోస్ట్‌ చేశారు.

తీవ్ర మానసిక ఒత్తిడి సమస్యతో సతమతమవుతున్న ఆదిత్య ఆస్పత్రిలో చేరడంతో ఊపిరితిత్తుల్లో సమస్య ఉండటంతో పాటు, రెండు మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు తెలిపారు. గత నాలుగు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సంగీత కార్యక్రమాల నిర్వాహకుడు, నిర్మాతగా ఆదిత్య బాలీవుడ్‌కు సుపరిచితులు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించిన ‘ఠాక్రే’కు ఆదిత్య పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని