‘సర్కారువారి పాట’లో అనుష్క.. నిజమెంత?

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమాకు పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంది. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Published : 22 Nov 2020 01:29 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమాకు పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంది. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ బ్యాంకు మేనేజర్‌గా అనుష్కశెట్టి కనిపించనుందన్నది దాని సారాంశం. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చివరికి తేలిందేంటంటే.. ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదట. 

ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి ట్విటర్‌లో డైరెక్టర్‌ పరుశురామ్‌ పేరుతో ఖాతా తెరిచారు. ‘‘సర్కారువారి పాట’లో అనుష్క ఓ పాత్ర పోషిస్తుండటం సంతోషంగా ఉంది. ఆమె ఈ సినిమాలో అదరగొడుతుందన్న నమ్మకం ఉంది. షూటింగ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’’ అని అందులో పోస్టు చేశాడు. తీరా అది నకిలీ ఖాతా అని తెలిసే సరికి ఈ వార్త కూడా నకిలీదేనని స్పష్టమైంది. ఇదిలా ఉండగా.. 2021 జనవరి మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని