‘అర్ధశతాబ్దం’ విడుదల వాయిదా

ఇంటర్నెట్‌ డెస్‌:  కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్ధ శతాబ్దం’. ‘‘న్యాయం ధర్మం అవుతుంది కానీ... ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదంటున్నాడు ఓ వ్యక్తి.

Updated : 07 Dec 2022 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్‌: కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్ధ శతాబ్దం’. ‘‘న్యాయం ధర్మం అవుతుంది కానీ... ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదంటున్నాడు ఓ వ్యక్తి. యుద్ధమే ధర్మం కానప్పుడు... ధర్మయుద్ధాలు  ఎక్కడివి. ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో? ఎందుకో? దేనికో..? ఈ విశాల భారతానికి అఖండ రాజ్యం’’ అని ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ఏప్రిల్‌ 2వ తేదీ  వరకు ఆగాల్సిందే.

‘ఆహా’ ఓటీటీ వేదికగా ‘అర్ధశతాబ్దం’ విడుదల కానుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో రిషిత శ్రీ, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్‌ పతాకంపై చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్నారు. నాఫాల్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, సుహాస్‌ తదితరులు నటిస్తున్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మార్చి 26న విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా విడుదల తేదీని ఏప్రిల్‌ 2కు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని