లైట్స్‌.. కెమెరా.. మాస్క్‌ ఆన్‌..

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘బెల్‌ బాటమ్‌’ చిత్రం తెరకెక్కుతోన్న

Updated : 21 Aug 2020 15:22 IST

ముంబయి: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘బెల్‌ బాటమ్‌’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రంజిత్‌.ఎమ్‌.తివారీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్‌ తన ట్విటర్‌ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు. దీంట్లో అక్షయ్‌ ‘‘లైట్స్‌, కెమెరా, మాస్క్‌ ఆన్‌, యాక్షన్‌’’ అంటూ క్లాప్‌ కొడుతూ కనిపించారు.

‘‘ఇకపై చిత్రీకరణలన్నీ కొత్త నిబంధనలను అనుసరించే   సాగుతాయి. ఇది చాలా కష్టమైన సమయం. కానీ, పని కొనసాగించాలి’’ అని ఆ వీడియోకు ఓ వ్యాఖ్యను జత చేశారు అక్కీ. 80ల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్‌ చిత్రమిది. వాణీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా.. హుమా ఖురేషి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. మోనిషా అడ్వాణి, మధు బోజ్వానీ, నిఖిల్‌ అడ్వాణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు