ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేస్తోంది..!

·రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు అతి త్వరలో ఓ సర్‌ప్రైజ్‌ రానుంది. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఇటీవల పూజాహెగ్డే...

Published : 17 Oct 2020 14:44 IST

హైదరాబాద్‌: ·రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు అతి త్వరలో ఓ సర్‌ప్రైజ్‌ రానుంది. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఇటీవల పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా.. సినిమాలోని ఆమె పాత్రను తెలియజేస్తూ ఓ ప్రత్యేక లుక్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

కాగా, ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘రాధేశ్యామ్‌’  ఫస్ట్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు రాధాకృష్ణ వెల్లడించారు. ‘వాళ్లు మిమ్మల్ని తప్పకుండా మరోసారి ప్రేమలో పడేలా చేస్తారు. బీట్స్‌ఆఫ్‌రాధేశ్యామ్‌.. అక్టోబర్‌ 23న మా మొదటి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో ఇటలీలో జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని