‘భైరవద్వీపం’ కోసం నానాపటేకర్, అమ్రిష్ పూరి
బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’. రోజా కథానాయిక. కె.ఆర్.విజయ, విజయ్ కుమార్, బాబూమోహన్
ఇంటర్నెట్డెస్క్: బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’. రోజా కథానాయిక. కె.ఆర్.విజయ, విజయ్ కుమార్, బాబూమోహన్, సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో మాంత్రికుడిగా విజయరంగరాజు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో బేతాళ మాంత్రికుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పెద్ద కసరత్తు జరిగింది.
దివంగత నటుడు, రచయిత రావి కొండలరావు ఈ చిత్రానికి కథ అందించారు. అంతకు ముందు విజయా సంస్థలో ‘బృందావనం’ తీసి మంచి విజయాన్ని అందించిన సింగీతం శ్రీనివాసరావుకు చిత్ర నిర్మాణ సంస్థ దర్శకత్వం బాధ్యతలు అప్పగించింది ‘పాతాళభైరవి’ వంటి జానపద కథ కన్నా కాస్త భిన్నంగా ఉండాలని కొత్త మలుపులతో సినిమా కథను సిద్ధం చేశారు రావి కొండలరావు. కథ విన్న వెంటనే బాలకృష్ణ కూడా ఒప్పుకొన్నారు. పైగా తన తండ్రి నటించిన ‘పాతాళ భైరవి’ శైలిలో కథ, కథనాలు ఉండటం ఆయనకు నచ్చింది. కథానాయికగా అప్పటికి ట్రెండ్లో కొనసాగుతున్న రోజాను తీసుకున్నారు. బాలకృష్ణ తల్లిగా కె.ఆర్. విజయ, తండ్రిగా విజయకుమార్, రోజా తల్లిదండ్రులుగా సంగీత, కైకాల సత్యనారాయణ, బాలకృష్ణ పెంపుడు తల్లిగా రాధాకుమారి, తండ్రిగా భీమేశ్వరరావు, బాలకృష్ణ తమ్ముడుగా బాబూమోహన్, గురువుగా మిక్కిలినేని, యక్షిణి ప్రత్యేకపాత్రలో రంభలు ఎంపికయ్యారు. పద్మనాభం, సుత్తివేలు అతిథి పాత్రలు పోషించారు. హాస్య పాత్రల్లో గిరిబాబు, శుభలేఖ సుధాకర్ నటించగా మరుగుజ్జు మనుషులుగా మాస్టర్ విశ్వేశ్వరరావు, చిట్టిబాబులు కనిపించారు.
అయితే, బేతాళ మాంత్రికుడు వంటి విలన్ పాత్రకు ఎస్.వి. రంగారావులాంటి నటుడైతే బాగుంటుందని చిత్ర బృందం భావించి అన్వేషణ మొదలు పెట్టింది. హిందీ నటులు నానాపటేకర్, అమ్రిష్ పూరి కూడా పరిశీలించిన జాబితాలో ఉన్నారు. అప్పుడే ‘వియత్నాం కాలనీ’ అనే మలయాళ సినిమా మద్రాసులో విడుదలయితే ఆ చిత్రాన్ని నిర్మాత వెంకటరామరెడ్డి చూశారు. అందులో నటించిన రాజకుమార్ అనే నటుడి మీద నిర్మాతకు గురి కుదిరింది. పైగా ఆ నటుడు తెలుగువాడని కూడా తెలియడంతో అతణ్ణి మాంత్రికుని వేషానికి ఎంపిక చేశారు. అతనికి ‘విజయా’ సంస్థ పేరు, ఎస్.వి. రంగారావు పేరు కలిసి వచ్చేలా ‘విజయ రంగ రాజా’ అనే పేరు పెట్టి ‘భైరవద్వీపం’లో విలన్గా పరిచయం చేశారు.
ఇక ఛాయాగ్రహణం విషయానికి వస్తే ట్రిక్ షాట్లువంటివి తీయడంలో నిష్ణాతుడైన ఎస్.ఎస్.లాల్ కుమారుడు సయ్యద్ కబీర్లాల్ను తీసుకున్నారు. కబీర్ లాల్ అంతకుముందు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి పనిచేశారు. 1993 జూన్ 25 న మద్రాసు వాహినీ స్టూడియోలో భారీగా నిర్మించిన సెట్టింగులో సినిమా ప్రారంభ వేడుక నిర్వహించారు. ముహూర్తపు షాట్ బాలకృష్ణ, రోజాలమీద చిత్రీకరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ క్లాప్ ఇవ్వగా, మెగాస్టార్ చిరంజీవి స్విచ్ ఆన్ చేశారు. ఎన్.టి. రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ముహూర్తం అవగానే రంభ, బాలకృష్ణల మీద ‘నరుడా ఓ నరుడా ఏమి కోరిక’ పాట చిత్రీకరించారు. 1994 ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్గుడ్ స్టోరీ.. పవన్ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్