‘బెల్‌ బాటమ్‌’ టీజర్‌ చూశారా?

బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. త్వరలో ప్రేక్షకుల్ని 80ల కాలంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఆయన రా ఏజెంట్‌గా నటించిన సినిమా ‘బెల్‌ బాటమ్‌’. మిస్టరీలను పరిష్కరించి దేశాన్ని కాపాడే ఉన్నతాధికారిగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా....

Updated : 05 Oct 2020 19:04 IST

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. త్వరలో ప్రేక్షకుల్ని 80ల కాలంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఆయన రా ఏజెంట్‌గా నటించిన సినిమా ‘బెల్‌ బాటమ్‌’. మిస్టరీలను పరిష్కరించి దేశాన్ని కాపాడే ఉన్నతాధికారిగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌ బెల్‌ బాటమ్‌ ప్యాంటు ధరించి.. విమానాశ్రయంలో స్టైలిష్‌గా నడుస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. డైలాగ్స్‌‌ లేకుండా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘80ల కాలం నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్‌ కథ’ అంటూ అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు స్కాట్‌ల్యాండ్‌లో జరిగింది. వాణీ కపూర్‌ కథానాయిక. హుమా ఖురేషీ, లారా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఇమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రంజిత్‌ ఎమ్‌. తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అక్షయ్‌ గత ఏడాది ‘కేసరి’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘గుడ్‌ న్యూజ్‌‌‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నాలుగు సినిమాలు విజయం అందుకోవడం విశేషం. నవంబరు 9న అక్షయ్‌ నటించిన ‘లక్ష్మీ బాంబ్‌’ ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. ఆయన, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ‘సూర్యవంశీ’ విడుదల లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇవికాకుండా బాలీవుడ్‌ ఖిలాడీ ‘పృథ్వీరాజ్‌’, ‘అత్రంగి రే’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని