‘బెల్ బాటమ్’ టీజర్ చూశారా?
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. త్వరలో ప్రేక్షకుల్ని 80ల కాలంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఆయన రా ఏజెంట్గా నటించిన సినిమా ‘బెల్ బాటమ్’. మిస్టరీలను పరిష్కరించి దేశాన్ని కాపాడే ఉన్నతాధికారిగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా....
ముంబయి: బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. త్వరలో ప్రేక్షకుల్ని 80ల కాలంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఆయన రా ఏజెంట్గా నటించిన సినిమా ‘బెల్ బాటమ్’. మిస్టరీలను పరిష్కరించి దేశాన్ని కాపాడే ఉన్నతాధికారిగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా టీజర్ను సోమవారం విడుదల చేశారు. ఇందులో అక్షయ్ బెల్ బాటమ్ ప్యాంటు ధరించి.. విమానాశ్రయంలో స్టైలిష్గా నడుస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. డైలాగ్స్ లేకుండా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘80ల కాలం నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ కథ’ అంటూ అక్షయ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు స్కాట్ల్యాండ్లో జరిగింది. వాణీ కపూర్ కథానాయిక. హుమా ఖురేషీ, లారా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా ఎంటర్టైన్మెంట్స్, ఇమ్మీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రంజిత్ ఎమ్. తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అక్షయ్ గత ఏడాది ‘కేసరి’, ‘మిషన్ మంగళ్’, ‘హౌస్ఫుల్ 4’, ‘గుడ్ న్యూజ్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నాలుగు సినిమాలు విజయం అందుకోవడం విశేషం. నవంబరు 9న అక్షయ్ నటించిన ‘లక్ష్మీ బాంబ్’ ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. ఆయన, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘సూర్యవంశీ’ విడుదల లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇవికాకుండా బాలీవుడ్ ఖిలాడీ ‘పృథ్వీరాజ్’, ‘అత్రంగి రే’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం