ప్రభాస్ పాత్ర పోషించడానికి భయం లేదు
‘అల్లుడుశీను’తో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు బెల్లకొండ సాయిశ్రీనివాస్. మొదటి సినిమాలోని తన నటనతో ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్.. ఆ తర్వాత ‘సాక్ష్యం’, ‘జయ జానకి నాయక’ లాంటి కుటుంబకథా చిత్రాలతో అభిమానులకు మరింత చేరువయ్యారు. శ్రీనివాస్ నటించిన చిత్రాలు హిందీలో డబ్ కావడంతో ముంబయిలో....
ఆరు సినిమాలు.. 200 మిలియన్ల వ్యూస్
హైదరాబాద్: ‘అల్లుడుశీను’తో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు బెల్లకొండ సాయిశ్రీనివాస్. మొదటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్.. ఆ తర్వాత ‘సాక్ష్యం’, ‘జయ జానకి నాయక’ లాంటి కుటుంబకథా చిత్రాలతో అభిమానులకు మరింత చేరువయ్యారు. శ్రీనివాస్ నటించిన చిత్రాలు హిందీలో డబ్ కావడంతో ముంబయిలో కూడా ఆయన క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఆయన అక్కడి ప్రేక్షకులనూ అలరించాలనే ఉద్దేశంలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘ఛత్రపతి’ చిత్రంతో బీటౌన్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైన శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
‘నేను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించాను. వాటిల్లో ఆరు చిత్రాలు(హిందీ డబ్బింగ్ వెర్షన్) యూట్యూబ్లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. సినిమాల వల్ల ముంబయి, దిల్లీ ప్రాంతాల్లో ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఇంతకుముందు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ నాకు సరిపడే స్ర్కిప్ట్ దొరకలేదు. ‘ఛత్రపతి’ కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్ వెర్షన్లో ప్రభాస్ పోషించిన పాత్రను రీక్రియేట్ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్ చిత్రాన్ని వీక్షించలేదు’
‘దశాబ్దం క్రితం తెరకెక్కించినప్పటికీ ‘ఛత్రపతి’ చిత్రాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అయితే మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని అందరికీ చేరువయ్యేలా స్ర్కిప్ట్లో మార్పులు చేశాం. కెరీర్పరంగా నేను తీసుకున్న అదిపెద్ద నిర్ణయం ఇదే.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా.’ అని బెల్లంకొండ శ్రీనివాస్ వివరించారు. ‘అల్లుడు శీను’తో ఆయన్ని కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం చేసిన వి.వి.వినాయక్.. ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్కు దర్శకత్వం వహించనున్నారు.
‘సీత’ చిత్రం తర్వాత శ్రీనివాస్ తెలుగులో నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్, అనుఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనిపించనున్నారు. నటుడు సోనూసూద్ ఓ కీలకపాత్రలో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’