‘2020’ని మరిపించిన పాటలు
సంగీతాన్ని ఆస్వాదించని వారుంటారా..? మనిషికి మనసు బాగాలేనప్పుడు మనశ్శాంతినిచ్చే మందు సంగీతం. ఆహ్లాదాన్ని పంచే ఔషధం సంగీతం. ఈ ఏడాది మొత్తం ఎక్కడ చూసినా కరోనా అనే పదమే కనిపించింది. కరోనా వార్తలే వినిపించేవి. ఇలా కరోనా అందరికీ విసుగుపుట్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: సంగీతాన్ని ఆస్వాదించని వారుంటారా..? మనిషికి మనసు బాగాలేనప్పుడు మనశ్శాంతినిచ్చే మందు సంగీతం. ఆహ్లాదాన్ని పంచే ఔషధం సంగీతం. ఈ ఏడాది మొత్తం ఎక్కడ చూసినా కరోనా అనే పదమే కనిపించింది. కరోనా వార్తలే వినిపించేవి. ఇలా కరోనా అందరికీ విసుగుపుట్టించింది. ఈ క్రమంలో కొంతమంది మాత్రం తమకు ఇష్టమైన సినిమా పాటలు వింటూ మనశ్శాంతిని పొందే ప్రయత్నం చేశారు. ఈ సంవత్సరం విడుదలై ప్రేక్షకులను అలరించిన సినిమా పాటలేమున్నాయో ఓసారి చూద్దాం.
‘మైండ్ బ్లాక్’ అయ్యిందిగా..
ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘మైండ్ బ్లాక్’ పాట నిజంగానే అందరి మైండ్ బ్లాక్ చేసింది. టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు, రష్మిక మందాన జోడీగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ విజయం సాధించిందంటే ప్రధాన కారణం పాటలు. ఇది అభిమానుల చెప్పే మాట. థియేటర్కు వెళ్లిన వాళ్లలో చాలామంది ఈ పాట కోసం వెళ్లినవాళ్లే. మహేశ్బాబు, రష్మిక కలిసి స్టెప్పేసి థియేటర్లోని ప్రేక్షకులతో కేకలు పెట్టించారు. యూట్యూబ్లోనూ ఈ పాట రికార్డులు సృష్టించింది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను శ్రీమణి, దేవీశ్రీ కలిసి రాశారు.
‘రాములో రాములా..’ ఆగం చేసింది..
‘అలవైకుంఠపురములో’ సినిమాలో పార్టీ సాంగ్ ‘రాములో రాములా’ ఒక ఊపుఊపేసింది. తమన్ తన స్టైల్లో సంగీతం అందించగా అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనురాగ్కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. లాక్డౌన్ మొత్తం అందరి ఇళ్లలోనూ ఇదే పాట వినిపించింది.
‘నువ్వు నాతో ఏమన్నావో..’ వినిపిస్తూనే ఉన్న బాలు గొంతు
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘డిస్కోరాజా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇందులో ఎస్పీ బాలు పాడిన ‘నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో’ పాట మాత్రం ప్రేక్షకుల చేవిల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు.
‘ఏదారెదురైనా..’
‘ఏదారెదురైనా.. ఎటువెళుతుందో.. అడిగానా..?’ ఈ మధ్య యూట్యూబ్లో తెగ వినిపిస్తోన్న పాట ఇది. తమిళ సినిమాకు రీమేక్గా వచ్చిన ‘జానూ’ సినిమాలో ‘లైఫ్ ఆఫ్ రామ్’ పేరుతో వచ్చిన ఈ పాటను సంగీత ప్రియులు బాగా ఆస్వాదించారు. శర్వానంద్, సమంత జోడీగా నటించిన ఈ సినిమాకు ప్రేమ్కుమార్ దర్శకత్వం వహించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పాటను ప్రదీప్కుమార్ ఆలపించారు. గోవింద వసంత సంగీతం అందించారు.
‘ఉండీపోవ నువ్విలా.. రెండూ కళ్లలోపలా..’ ఉండిపోయింది
లాక్డౌన్లో కుర్రకారు మొబైల్ ఫోన్లలో మార్మోగిన పాటల్లో ‘ఉండీపోవ నువ్విలా.. రెండూ కళ్లలోపలా..’ ఒకటి. నందు, ప్రియాంకశర్మ జంటగా నటించిన ‘సవారి’ సినిమాలో అన్ని పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటను పూర్ణచారి రచించగా.. శేఖర్చంద్ర సంగీతం అందించారు. జితేందర్ గాత్రం అందించారు.
‘వాట్టే.. వాట్టే.. వాట్టే బ్యూటీ..’ వాట్టే హిట్టు
వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ సినిమాలోనిదీ పాట. నితిన్, రష్మిక ఆడిపాడిన ఈ పాట మంచి విజయం సాధించింది. కాసర్ల శ్యామ్ రచయిత. ధనుంజయ్, అమలా చేబోలు కలిసి పాడారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.
అలరించిన ‘ఏమో.. ఏమో.. ఏమో..’
‘రాహూ’ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘ఏమో.. ఏమో.. ఏమో’ పాట మెలొడీ ప్రేమికులను బాగా ఆకట్టుకుంది. శ్రీనివాసమౌళి రాసిన ఈ పాటకు ప్రవీణ్ లక్కరాజు సంగీంతం అందించారు. సుబ్బు వేదుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అభిరామ్, క్రితిగార్గ్ హీరోహీరోయిన్లుగా కనిపించారు.
స్టెప్పులేయించిన ‘నక్కిలీసు గొలుసు’
ఉత్తరాంధ్ర జానపదం నుంచి సేకరించిన ‘నక్కిలీసు గొలుసు’ ఎంతోమందితో స్టెప్పులేయించింది. శ్రీకాకుళం యాసలో వచ్చిన ఈ పాట ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కరుణకుమార్ దర్శకత్వం వహించిన ‘పలాస 1978’ చిత్రంలోనిదీ పాట. రఘుకుంచె ఈ పాటను ఆలపించడంతో పాటు సంగీతం కూడా అందించారు.
‘తరగతి గది దాటి..’ అలరించిన పాట
‘కలర్ఫొటో’ చిత్రంలోని ఈ పాట ప్రస్తుతం చాలామందికి రింగ్టోన్గా మారింది. ఈ పాటను కిట్టు విస్సప్రగడ రాయగా.. కాల భైరవ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. సందీప్రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యువనటులు సుహాస్, చాందినీ చౌదరి ప్రధానపాత్రల్లో నటించారు.
‘హేయ్.. ఇది నేనేనా..’
కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో సినీ అభిమానులు కేవలం పాటలను మాత్రమే ఆస్వాదించగలిగారు. అయితే.. దాదాపు 9నెలల తర్వాత తొలి సారిగా అభిమానులు థియేటర్లో చూసిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఈ సినిమాలోని ‘హేయ్ ఇది నేనేనా..’ అందర్నీ బాగా అలరించింది. ఈ సినిమాలో సాయితేజ్, నభా నటేశ్ జంటగా నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..