ఎట్టకేలకు రియాకు బెయిల్‌ మంజూరు..!

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో అరెస్ట్‌ అయిన సదరు నటుడి ప్రేయసి రియాచక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు బుధవారం బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. రూ.లక్ష పూచీకత్తుతో ఆమెకు బెయిల్‌ ఇస్తున్నట్లు..

Updated : 07 Oct 2020 13:15 IST

ముంబయి: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో అరెస్ట్‌ అయిన రియాచక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు బుధవారం బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. రూ.లక్ష పూచీకత్తుతోపాటు ప్రతి పది రోజులకొకసారి సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఆమె హాజరు కావాలని షరతులు విధించింది. అయితే ఈ‌ కేసులో అరెస్ట్‌ అయిన శామ్యూల్‌ మిరండా, దిపేశ్‌ సావంత్‌కు బెయిల్‌ మంజూరు చేయగా.. రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి మాత్రం బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

జూన్‌ 14న తన నివాసంలో మృతి చెంది కనిపించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుశాంత్‌తో సన్నిహిత సంబంధాలున్న వారందర్నీ పోలీసులు విచారించి.. అనంతరం రియా చక్రవర్తిని గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఎన్సీబీ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్‌ కోసం రియా పిటిషన్‌ దాఖలు చేసుకున్నప్పటికీ కోర్టు కొట్టివేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని