‘క్యాష్‌’లో శ్రీముఖి, విష్ణు ప్రియ సందడే సందడి

సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్‌ ఉంది. సెప్టెంబరు 26న ప్రసారం కాబోతున్న షోలో సుమ అతిథులుగా విచ్చేసిన బుల్లితెర స్టార్స్‌ శ్రీముఖి, విష్ణు ప్రియ, గెటప్‌ శ్రీను, పండుతో కలిసి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా కలిసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించబోతున్నారు.

Published : 20 Sep 2020 22:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్‌ ఉంది. సెప్టెంబరు 26న ప్రసారం కాబోతున్న షోలో అతిథులుగాబుల్లితెర స్టార్స్‌ శ్రీముఖి, విష్ణు ప్రియ, గెటప్‌ శ్రీను, పండులతో కలిసి సుమ సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా కలిసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించబోతున్నారు.

తాజాగా విడుదలైన సెప్టెంబరు 26న కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నవ్వులు పూయిస్తోంది. సుమ, శ్రీముఖి కలిసి ‘నీ పక్కనపడ్డాదొలేదో చూడవే పిల్ల..’ పాటపై కామెడీ చేశారు. ‘పండు నీకు ఓకే అయితే నిన్ను చేసుకుంటా..’ అంటూ శ్రీముఖి సరదాగా మాట్లాడారు. వీరంతా కలిసి ‘క్యాష్‌ పాల కేంద్రం’ కూడా ఏర్పాటు చేశారు. మరి సరదా సరదాగా సాగిపోయే ఆ ఎపిసోడ్‌ను చూడాలంటే శనివారం వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ సరదా సరదాగా సాగిపోయి ఈ ప్రోమోను చూడండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని