ఛార్మి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్
తన తల్లిదండ్రులు ఇటీవల కరోనా బారిన పడ్డారని నటి ఛార్మి తాజాగా వెల్లడించారు. అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట్లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు కొవిడ్-19 బారినపడ్డారని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా ఒకవేళ ఎవరిలోనైనా....
హైదరాబాద్: తన తల్లిదండ్రులు ఇటీవల కరోనా బారిన పడ్డారని నటి ఛార్మి తాజాగా వెల్లడించారు. అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట్లో ఆమె ఈ పోస్ట్ పెట్టారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు కొవిడ్-19 బారినపడ్డారని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు.
‘అక్టోబర్ 22న నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మార్చినెల నుంచి లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వారు హైదరాబాద్లోని మా నివాసంలో ఉంటున్నారు. అయితే ఎన్నో జాగ్రత్తలు పాటించినప్పటికీ.. ఇటీవల వచ్చిన హైదరాబాద్ వరదలు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో వాళ్లు కరోనా బారిన పడ్డారు. ఎప్పటినుంచో మా నాన్న ఆరోగ్య పరిస్థితి తెలిసిన నాకు ఈ వార్త వినగానే భయంగా అనిపించింది. వెంటనే చికిత్స నిమిత్తం వాళ్లిద్దరూ హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఒకవేళ మీలో ఎవరికైనా కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి. ఆరంభ దశలోనే గుర్తించి నిర్మూలిస్తే ఎలాంటి నష్టం జరగదు. మా అమ్మానాన్నలు తిరిగి ఆరోగ్యవంతులుగా చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. దుర్గాదేవి మన చుట్టూ ఉన్న చెడుని తొలగించాలని, మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. నా తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రార్థనలు చేయాల్సిందిగా కోరుతున్నాను’ అని ఛార్మి పోస్ట్ పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే