సన్నీ ఆట.. శిల్ప యోగా.. బన్ని నామినేట్
చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు సమయమే తెలియదు. ఇక ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా మన స్నేహితులతో పంచుకుంటాం. బోలెడన్ని లైక్లు
ఇంటర్నెట్డెస్క్: చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు సమయమే తెలియదు. ఇక ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా మన స్నేహితులతో పంచుకుంటాం. బోలెడన్ని లైక్లు, కామెంట్లు. అదే సినిమా తారలైతే ఇక చెప్పేది ఏముంది? తాజాగా మన సినీ తారలు ఎన్నో విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
ఫిట్నెస్ విషయంలో అందాల తార శిల్పాశెట్టి ఎంతో జాగ్రత్త వహిస్తారు. తాజాగా వ్యాయామం చేస్తున్న వీడియోను పంచుకున్నారు. కరోనా కారణంగా ప్రయాణాలు చేయలేకపోతున్నా, వర్కవుట్లు మాత్రం మానడం లేదన్నారు.
ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. అల్లు అర్జున్ను నామినేట్ చేశారు. నటుడు రాజీవ్ కనకాల కూడా ఈ ఛాలెంజ్లో పాల్గొన్నారు. నితిన్-శాలిని కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ కథానాయిక కీర్తి సురేశ్ శుభాకాంక్షలు తెలిపారు. యువ నటుడు కార్తికేయ నితిన్తో దిగిన ఫొటోను పంచుకోగా, హైదరాబాదీ పోరడు రాహుల్ సిప్లిగంజ్ చార్మినార్ దగ్గర ఫొటో దిగి షేర్ చేశారు. సాయికుమార్ పుట్టిన రోజు సందర్భంగా ‘శ్రీకారం’ చిత్రంలోని ఆయన లుక్ను పంచుకున్నారు.
ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్2’ ఒకటి ఇందులో అధీర పాత్రను ఈనెల 29న విడుదల చేయనున్నారు. లాక్డౌన్ ఉన్నా యోగా చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కథానాయిక శద్ధాదాస్ తెలిపింది. ఇక మరో కథానాయిక అదా శర్మ కొత్త సినిమా ఒప్పుకొన్నారు.దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టిన రోజు సందర్భంగా మహేశ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సన్నీ తన పెర్ఫామెన్స్తో ఉర్రూతలూగించగా, సమీరారెడ్డి విచిత్ర వేషాలతో అలరించారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..