శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్‌’ ట్రైలర్‌ చూశారా?

‘ఇది హైదరాబాద్‌లో ఉంటున్న రాజు.. రెడ్డి.. రావుల కథ.. కాదు వ్యథ’ అంటూ ‘క్రేజీ అంకుల్స్‌’ను చూపించబోతున్నారు. నటి, వ్యాఖ్యాత

Updated : 27 Dec 2020 04:23 IST

హైదరాబాద్: ‘ఇది హైదరాబాద్‌లో ఉంటున్న రాజు.. రెడ్డి.. రావుల కథ.. కాదు వ్యథ’ అంటూ ‘క్రేజీ అంకుల్స్‌’ను చూపించబోతున్నారు. నటి, వ్యాఖ్యాత శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. సత్తి బాబు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ‘భార్యను మోసం చేస్తే చంపేస్తా’ ‘ఈ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు రాములు ఉన్నారు’ అన్న మాటలు ఆసక్తిగా మారాయి. అసలు ఆ ముగ్గురు ‘ఆర్ఆర్ఆర్’ చేసిన పనేంటి? ఈ మేడమ్ ఎవరు? ఆమె ఎందుకు వారిని అలా అభివర్ణించింది? ఇంతకీ వారి కథ ఏ మలుపు తిరిగింది? వారి వ్యథ తీరిందా? తెలియాంటే సినిమా చూడాల్సిందే. అప్పటివరకూ ఈ క్రేజీ ట్రైలర్‌ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు