Dhanush: వరుసగా ఓటీటీలో మూడో చిత్రం

తమిళ కథానాయకుడు ధనుష్‌ నటించిన తాజా చిత్రం ‘మారన్‌’. మాళవిక మోహన్‌ కథానాయిక. సముద్రఖని ముఖ్యపాత్ర పోషించారు. యాక్షన్‌ నేపథ్యంలో

Updated : 12 Mar 2022 12:08 IST

మిళ కథానాయకుడు ధనుష్‌ నటించిన తాజా చిత్రం ‘మారన్‌’. మాళవిక మోహన్‌ కథానాయిక. సముద్రఖని ముఖ్యపాత్ర పోషించారు. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు కార్తిక్‌ నరేన్‌ దర్శకుడు. ఇందులో ధనుష్‌ జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే తేదీ చెప్పలేదు. శుక్రవారం నుంచే ఈ చిత్రాన్ని డిస్నీ-హాట్‌స్టార్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పటికే ధనుష్‌  నటించిన తమిళ సినిమాలు ‘జగమేతిందిరమ్‌’, బాలీవుడ్‌ చిత్రం ‘అత్రంగి రే’ ... వరుసగా ఓటీటీలో ప్రదర్శితమయ్యాయి. ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ది గ్రే మ్యాన్‌’నూ ఓటీటీలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని