ప్రదీప్కి పూర్ణ కండిషన్..!
అమ్మాయిలతో మాట్లాడొద్దని వ్యాఖ్యాత ప్రదీప్కి నటి పూర్ణా కండిషన్ పెట్టారు. అయితే అది నిజ జీవితంలో కాదు కేవలం ఓ స్కిట్ కోసం మాత్రమే. ప్రియమణి, బాబా భాస్కర్ న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ‘ఢీ ఛాంపియన్స్’. సుడిగాలి సుధీర్, రష్మి, హైపర్ ఆది, వర్షిణి
కారణమేంటో తెలుసా..
హైదరాబాద్: అమ్మాయిలతో మాట్లాడొద్దని వ్యాఖ్యాత ప్రదీప్కి నటి పూర్ణ షరతు పెట్టారు. అయితే అది నిజ జీవితంలో కాదు కేవలం ఓ స్కిట్ కోసం మాత్రమే. ప్రియమణి, బాబా భాస్కర్ న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ‘ఢీ ఛాంపియన్స్’. సుడిగాలి సుధీర్, రష్మి, హైపర్ ఆది, వర్షిణి ఈ షోలో టీమ్ లీడర్స్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సుధీర్-రష్మి, ఆది-వర్షిణిలకు యూట్యూబ్ జోడీలుగా పేరు ఉన్న విషయం తెలిసిందే. సరికొత్త యూట్యూబ్ జోడీగా పూర్ణా-ప్రదీప్ మారారని ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్లో ప్రియమణి సరదాగా చెప్పారు.
కాగా, త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్లో ‘నువ్వంటేనే ఇష్టం.. నువ్వు కాదంటేనే కష్టం’ అంటూ రాజు చేసిన పర్ఫామెన్స్కి జడ్జిలందరూ ఫిదా అయ్యారు. సూపర్గా ఉందని కామెంట్లు ఇచ్చారు. అనంతరం సుధీర్తో కలిసి తేజు.. ‘ముసుగు వెయోద్దు మనసు మీద..’ సాంగ్కి డ్యాన్స్ చేయగా.. సెట్లో ఉన్నవాళ్లందరూ అవాక్కయ్యారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి సుధీర్పై ఫన్నీగా కామెంట్లు చేసిన బాబాభాస్కర్ మాస్టర్ సైతం.. సదరు టీమ్ లీడర్ని ‘నువ్వు బెస్ట్ రా’ అంటూ ప్రశంసించారు.
డ్యాన్స్ షోలో భాగంగా గెలిచిన టీమ్ లీడర్స్ ఓడిపోయిన టీమ్ లీడర్స్కి సరదాగా టాస్క్లు ఇవ్వడం ‘ఢీ’లో కొన్ని సీజన్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఎపిసోడ్లో టాస్క్ కోసం పూర్ణా, ప్రదీప్ దంపతులుగా వ్యవహరిస్తారు. వారి ఇంట్లో అద్దె కోసం రష్మి, వర్షిణి, సుధీర్, ఆది ప్రయత్నాలు చేస్తారు. అయితే అమ్మాయిలకి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి అంగీకరించిన పూర్ణా.. ‘ఇల్లు అద్దెకు ఇస్తా కానీ మీరు వాళ్లతో మాట్లాడకూడదు. వాళ్లు కూడా మీతో మాట్లాడకూడదు.’ అని ప్రదీప్కి ఓ కండిషన్ పెడుతుంది. ఒకపక్క నవ్వులు పూయిస్తూనే మరోపక్క క్వాటర్ ఫైనల్కి ఎవరు అడుగుపెట్టనున్నారో అనే టెన్షన్తో ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ‘ఢీ ఛాంపియన్స్’ ఎపిసోడ్ చూడాలంటే వచ్చే బుధవారం వరకూ వేచి చూడాల్సిందే. అక్టోబర్ 14న ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో చూసేయండి..!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్