వాటితో నాకు సంబంధం లేదు: బండ్ల గణేశ్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందారు బండ్ల గణేశ్‌. పలువురు అగ్ర నటులతో సినిమాలు తీసిన ఆయన తర్వాత బ్రేక్‌ తీసుకుని.. రాజకీయాల్లో అడుగుపెట్టారు. మళ్లీ వెనుదిరిగి సినిమాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయడానికి సిద్ధమౌతున్నారు....

Published : 22 Nov 2020 17:14 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందారు బండ్ల గణేశ్‌. పలువురు అగ్ర నటులతో సినిమాలు తీసిన ఆయన తర్వాత బ్రేక్‌ తీసుకుని.. రాజకీయాల్లో అడుగుపెట్టారు. మళ్లీ వెనుదిరిగి సినిమాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయడానికి సిద్ధమౌతున్నారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా ఇటీవల ప్రకటించారు.

కాగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేశ్‌ను నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘నాకు ఏ రాజకీయ పార్టీలతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్‌ చేయొద్దు. ఇది నా అభ్యర్థన’ అని నెటిజన్లను కోరారు. బండ్ల గణేశ్‌ 2015లో చివరిసారి ‘టెంపర్‌’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కనిపించారు. ఇటీవల కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ఆయన ఇప్పటికే పవన్‌తో ‘తీన్‌మార్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని