మాకు అనుష్కే కావాలి..!
అందం, అభినయంతోపాటు నటనలోని రాజసంతో ఎంతో మంది సినీ ప్రియుల మదిని గెలుచుకున్నారు అగ్ర కథానాయిక అనుష్క శెట్టి. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘దేవసేన’.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో పాత్రలు ఆమెలోని నటికి అద్దం పడతాయి. అయితే తాజాగా ప్రకటించిన ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంలో...
దర్శకుడికి సందేశాలు పంపుతున్న అభిమానులు
హైదరాబాద్: అందం, అభినయంతోపాటు నటనలోని రాజసంతో ఎంతో మంది సినీ ప్రియుల మదిని గెలుచుకున్నారు అగ్ర కథానాయిక అనుష్క శెట్టి. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘దేవసేన’.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో పాత్రలు ఆమెలోని నటనకి అద్దం పడతాయి. అయితే తాజాగా ప్రకటించిన ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంలో అనుష్కను కథానాయికగా తీసుకోవాలని కోరుతూ అభిమానులు సదరు చిత్ర దర్శకుడికి వరుస సందేశాలు పంపిస్తున్నారు. చిన్న విరామానంతరం గుణశేఖర్ తెరకెక్కించనున్న చిత్రం ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించనున్నట్లు గుణశేఖర్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఈ మేరకు ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ను శుక్రవారం సాయంత్రం ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
కాగా, గుణశేఖర్ షేర్ చేసిన మోషన్ పోస్టర్కి సినీ ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్కను హీరోయిన్గా తీసుకోవాలని కోరుతూ ఎంతో మంది సినీ ప్రియులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘గుణశేఖర్ సర్.. దయచేసి అనుష్కను హీరోయిన్గా తీసుకోండి’, ‘ఈ ప్రేమకథా చిత్రానికి అనుష్క చక్కగా నప్పుతుంది.’, ‘ఈ కథకి మా క్వీన్ సరిపోతుంది.’ అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించేందుకు అనుష్క అంగీకారం తెలపాలంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు నటించనున్నారనే విషయంలో చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత అనుష్క తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికీ నచ్చే చిత్రం
సుమన్ తేజ్, గరీమ చౌహాన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా, రాచాల యుగంధర్ నిర్మించారు -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?