స్వాతంత్రోద్యమ ప్రేమ కథ

అర్జున్‌ కపూర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో కాశ్వీ నాయర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్‌అబ్రహం, అదితిరావ్‌ హైదరీ ప్రత్యేక పాత్రల్లో  నటిస్తున్నారు. తాజాగా

Published : 27 Aug 2020 11:28 IST

ముంబయి: అర్జున్‌ కపూర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో కాశ్వీ నాయర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్‌అబ్రహం, అదితిరావ్‌ హైదరీ ప్రత్యేక పాత్రల్లో  నటిస్తున్నారు. తాజాగా వాళ్ల లుక్‌లను చిత్రబృందం పంచుకుంది. 1947 కాలంలో జరిగే కథ. స్వాతంత్రోద్యమ నేపథ్యంతో ముడిపడిన ప్రేమ కథ ఇది. ఇందులో జాన్‌ అబ్రహం, అదితీలు అర్జున్‌కపూర్‌కి తాతయ్య, నాన్నమ్మలుగా కనిపించనున్నారు.

‘‘1946-47ల్లో ఓ జంటగా జాన్‌, నేను నటిస్తున్నాం. అసంపూర్తిగా   మిగిలిన వాళ్ల ప్రేమ కథను సుఖాంతం చేసే యువకుడి పాత్రలో అర్జున్‌ నటిస్తున్నాడు. ‘‘ఇలాంటి కథలు ఈమధ్య కాలంలో రావడం చాలా తక్కువై    పోయింది. ఇందులో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది’’అని అదితీరావ్‌ ట్వీట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని