పిసినారి పెళ్లి.. లాక్‌డౌన్‌తో తిప్పలు

హాస్యనటుడు సత్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ నటుడు సందీప్ కిషన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట. అర్జావీరాజ్‌ కథానాయిక. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో

Updated : 19 Dec 2020 16:13 IST

హైదరాబాద్‌: హాస్యనటుడు సత్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ నటుడు సందీప్ కిషన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట. అర్జావీరాజ్‌ కథానాయిక. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ చిత్రాన్ని నిర్మించారు. కాగా.. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల చేశారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమాలో.. పిసినారి అయిన హీరో మహేశ్‌ (సత్య) కరోనా(లాక్‌డౌన్‌) సమయంలో నిబంధనలు పాటిస్తూ.. తక్కువ మంది సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాడు. ఎక్కువ మంది పెళ్లికి రాకపోవడం వల్ల మంచే జరిగిందని సంబరపడతాడు. అయితే.. లాక్‌డౌన్‌ పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అసలు కథ మొదలవుతుంది. లాక్‌డౌన్‌లో అంతమంది చుట్టాలు ఇంట్లోనే ఉండిపోవడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్నదే కథ. సినిమా మొత్తం ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.వైవా హర్ష, కిరీటి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

ఇదీ చదవండి..

ఆ సినిమా 100శాతం నేనే షూట్‌ చేశా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని