ఏడేళ్ల స్నేహం.. మూడేళ్ల ప్రేమ..: కాజల్
అగ్ర కథానాయిక కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో ప్రేమ, పెళ్లి గురించి ఎట్టకేలకు బయటపెట్టారు. అక్టోబరు 30న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె పెళ్లి తర్వాత ప్రముఖ మ్యాగజైన్ ‘వోగ్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. గౌతమ్తో బంధం, కరోనా సమయంలో పెళ్లి తదితర విషయాల గురించి ముచ్చటించారు....
లాక్డౌన్ కారణంగా ఇప్పుడు పెళ్లి...
ముంబయి: అగ్ర కథానాయిక కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో ప్రేమ, పెళ్లి గురించి ఎట్టకేలకు బయటపెట్టారు. అక్టోబరు 30న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె పెళ్లి తర్వాత ప్రముఖ మ్యాగజైన్ ‘వోగ్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. గౌతమ్తో బంధం, కరోనా సమయంలో పెళ్లి తదితర విషయాల గురించి ముచ్చటించారు. గత ఏడేళ్లుగా గౌతమ్ తెలుసని, కానీ లాక్డౌన్ తమ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకొచ్చేలా చేసిందని కాజల్ పేర్కొన్నారు.
‘గత మూడేళ్లుగా నేను, గౌతమ్ డేటింగ్లో ఉన్నాం, ఏడేళ్లుగా మేం స్నేహితులం. ఒకరి జీవితంలో మరొకరి ప్రాధాన్యత రోజురోజుకీ పెరిగింది. ఇద్దరం వివిధ పార్టీల్లో, ముఖ్యమైన సమావేశాల్లో కలుసుకునేవాళ్లం. కానీ లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని వారాలపాటు ఒకర్నొకరం చూసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. మాస్కులు ధరించి సరకులు కొనడానికి వెళ్లినప్పుడు కలుసుకున్నాం. ఇద్దరం కలిసి జీవించాలనే విషయం అప్పుడే మాకు అర్థమైంది’.
‘రొమాన్స్ విషయానికి వస్తే గౌతమ్ నాటకీయంగా వ్యవహరించే వ్యక్తి కాదు. సినిమాలో హీరోలా ప్రవర్తించడు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించా. గౌతమ్ సున్నితంగా ప్రపోజ్ చేసిన విధానం నా మనసును తాకింది. ఆరోజు ఇద్దరం భావోద్వేగానికి గురయ్యాం.. చాలా సేపు మాట్లాడుకున్నాం. గౌతమ్ తన భవిష్యత్తులో నేను ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడో తెలిపిన తీరు హృదయాన్ని కదిలించింది. గౌతమ్ తన ఫీలింగ్స్ విషయంలో చాలా ప్రామాణికంగా ఉంటాడు’ అని కాజల్ పేర్కొన్నారు.
జూన్ నెలలో కాజల్-గౌతమ్ నిశ్చితార్థం జరిగింది. అక్టోబరు 29న మెహెందీ, హల్దీ వేడుకలు ఇంట్లోనే జరిగాయి. 30న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ముంబయి తాజ్ హోటల్లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. తమకు దక్షిణాదితో అనుబంధం ఉందని, అందుకే జీలకర్ర-బెల్లంతో వివాహ తంతు జరిపించామని కాజల్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!