మరోసారి అదరగొట్టిన కీర్తిసురేశ్‌

‘మన రాతను మనమే రాసుకోవాలా’ అంటోంది కీర్తిసురేశ్‌. ‘మహానటి’తో అందరి హృదయాలను దోచుకున్న ఆమె మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమైంది. కీర్తిసురేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’

Published : 16 Aug 2020 00:44 IST

హైదరాబాద్‌: ‘మన రాతను మనమే రాసుకోవాలా’ అంటోంది కీర్తిసురేశ్‌. ‘మహానటి’తో అందరి హృదయాలను దోచుకున్న ఆమె మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమైంది. కీర్తిసురేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. నాగేశ్‌ కుకునూరు దర్శకుడు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

కీర్తిసురేశ్‌ మరోసారి విభిన్నమైన పాత్రను ఎంచుకున్నారు. అదృష్టం లేని ఒక పల్లెటూరి అమ్మాయి ఏకంగా రైఫిల్‌ షూటింగ్‌లో ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నదనే విషయాన్ని అలరించేలా తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్‌రాజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్‌, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని