కేటీఆర్‌కు చెక్‌ అందజేసిన నటుడు రామ్‌

భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన భాగ్యనగర వాసులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు దాతలు ముందుకొస్తున్నారు...

Published : 22 Oct 2020 14:20 IST

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన భాగ్యనగర వాసులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు దాతలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమవంతు బాధ్యతగా విరాళాలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందులో బాగంగా వరద బాధితుల సహాయార్థం యువ కథానాయకుడు రామ్‌ పోతినేని తన వంతుగా రూ.25లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మంత్రి కేటీఆర్‌ కార్యాలయానికి స్వయంగా వెళ్లిన రామ్‌.. రూ.25లక్షల చెక్‌ను కేటీఆర్‌కు అందజేశారు. దర్శకుడు ఎన్‌.శంకర్‌ రూ.10లక్షల విరాళాన్ని కేటీఆర్‌కు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని