‘ఆచార్య’ సెట్‌కు తరలివెళ్లిన సోనూ ఫ్యాన్స్‌

కరోనా నుంచి నిస్సహాయుల పాలిట ఆపర్బాంధవుడిగా మారిన స్టార్‌ సోనూసూద్‌. వసల కార్మికుల్ని స్వగ్రామాలకు తరలించడం నుంచి పేదల వైద్యం, విద్య వరకూ ఎన్నో రూపాల్లో తనవంతు సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన క్రేజ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఓ గొప్ప నటుడిగా గుర్తింపు....

Published : 30 Nov 2020 14:27 IST

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో నిస్సహాయుల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన స్టార్‌ సోనూసూద్‌. వలస కార్మికుల్ని స్వగ్రామాలకు తరలించడం నుంచి పేదల వైద్యం, విద్య వరకూ ఎన్నో రూపాల్లో తనవంతు సాయం అందిస్తున్నారు. దీంతో ఆయన క్రేజ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఓ గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన ఆయన.. ఇప్పుడు పేదల హృదయాల్లో రియల్‌ హీరోగా చెరగని ముద్ర వేశారు. సోనూ ఎక్కడ కనిపించినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. ‘ఆచార్య’ సినిమా సెట్‌లో ఉన్న ఆయన్ను కలవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందని తెలుసుకుని ఆయన వ్యాన్‌ను చుట్టుముట్టారు. వాహనం‌ నుంచి బయటికి వచ్చిన ఆయన్ను పలకరించి.. తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇదే సందర్భంగా అవసరాల్లో ఉన్న కుటుంబాల్ని లోపలికి పిలిచి, సోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది.

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆయన సేవను అభినందిస్తూ చిత్ర బృందం సైతం సన్మానించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని