నేను అమాయకురాలిని: రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టైన సదరు హీరో ప్రేయసి, నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. అక్టోబర్ 6వ తేదీవరకూ రియా చక్రవర్తికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే..
రేపటికి వాయిదా పడిన బెయిల్ పిటిషన్
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. అక్టోబర్ 6వ తేదీవరకూ రియా చక్రవర్తికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ కోసం బొంబాయి హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా.. ముంబయిలో భారీగా వర్షాలు పడుతోన్న నేపథ్యంలో హైకోర్టు విచారణలను గురువారానికి వాయిదా వేసింది.
తాను అమాయకురాలినని, ఎన్సీబీ బృందం ఉద్దేశపూర్వకంగానే తనతోపాటు తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని రియా చక్రవర్తి తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాల విచారణ కారణంగా ఇప్పటికే తన మానసిక ఆరోగ్యం ఇబ్బందికరంగా మారిందని పిటిషన్లో ఆమె పేర్కొంది. అంతేకాకుండా తాను పరిచయం కాకముందు నుంచే సుశాంత్కి డ్రగ్స్ అలవాటు ఉందని, కొన్ని సందర్భాల్లో మాత్రమే సుశాంత్కి తాను మాదకద్రవ్యాలు అందించానని, అది కూడా తన సొంతడబ్బుతో కొనుగోలు చేశానని బెయిల్ పిటిషన్లో రియా వెల్లడించారు.
స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన బిహార్ డీజీపీ
సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు విచారణలో భాగంగా సోషల్మీడియా వేదికగా ముంబయి పోలీసులపై పలు వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తాజాగా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు. బీహార్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకే ఆయన పదవీ విరమణ చేసినట్లు సమాచారం. దీంతో రియా చక్రవర్తి తరఫు న్యాయవాది ‘సుశాంత్ సింగ్ రాజ్పూత్కి ఎలాంటి న్యాయం జరగలేదు కానీ, గుప్తేశ్వర్ పాండేకి మాత్రం న్యాయం జరిగింది’ అంటూ ఆరోపణలు చేశారు. దీంతో గుప్తేశ్వర్ పాండే మీడియాతో మాట్లాడారు. ‘సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు విచారణకు, నా రిటైర్మెంట్కు ఎలాంటి సంబంధం లేదు. న్యాయానికి అనుగుణంగానే నేను నడుచుకుంటాను. ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అలాగే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాల్లోకి వెళ్లకుండా సామాజిక సేవ చేయగలను’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..