మిలింద్ సోమన్‌ కొత్త లుక్‌ చూశారా?

‘పౌరాష్‌పూర్‌’ చిత్రంతో మిలింద్‌ సోమన్‌ జీ5, ఆల్ట్‌ బాలాజీ ఓటీటీలలో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Published : 05 Dec 2020 22:42 IST

దిల్లీ: ‘పౌరాష్‌పూర్‌’ వెబ్‌ షో ద్వారా జీ5, ఆల్ట్‌ బాలాజీ ఓటీటీ ప్రేక్షకులను మిలింద్‌ సోమన్ అలరించనున్నారు. సమానత్వం, రాజకీయం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మిలింద్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఈ చిత్రంలో నేను థర్డ్‌ జెండర్ పాత్రను పోషిస్తున్నాను. ఇలాంటి పాత్రను ఎన్నడూ చేయలేదు. ఈ ప్రపంచంలో థర్డ్‌ జెండర్‌ చాలా పవర్‌ఫుల్‌. ఈ లోకంతో వారు పోరాడుతారు’ అని ఆయన రాసుకొచ్చారు. అంతేకాకుండా అద్భుతమైన మేథస్సు కలిగి ఉండే పాత్ర అని ఆయన అన్నారు.

దీనికి బాలాజీ హెడ్ ఏక్తా కపూర్‌ స్పందిస్తూ.. ‘మీరు చాలా అద్భుతంగా ఉన్నారు’ అని ఆమె అన్నారు. ఆయన భార్య అంకిత స్పందిస్తూ.. ‘ఆ-మే-జింగ్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని