Lakshyam2: గోపీచంద్‌.. ‘లక్ష్యం2’

గోపీచంద్‌ కథా నాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 20 Mar 2022 09:29 IST

గోపీచంద్‌ కథా నాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డింపుల్‌ హయాతి కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం మిళితమైన బలమైన కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమా కోసం ‘లక్ష్యం2’ అనే టైటిల్‌ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్‌ నటిస్తున్న 30వ చిత్రమిది. ఈనెల 21నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జే మేయర్‌, ఛాయాగ్రహణం: వెట్రి పళని స్వామి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని